టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి వ్యవహారం ఏ మలుపు తిరుగుతుంది ఏంటీ అనేది అందరిలో ఆసక్తి నెలకొంది. రాజకీయంగా ఈ దాడి నిన్నటి నుంచి సంచలనం అయింది. ఇక దాడి తర్వాత పరిణామాలపై ఏపీ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎక్కడికక్కడ నాయకులను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ దాడికి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ స్పందించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ మాట్లాడే మాటలను సహించే పరిస్థితి లేదు అని అన్నారు ఆయన. ముఖ్యమంత్రి హోదా ఉన్న వ్యక్తిపై ఎన్ని వ్యాఖ్యలు చేశారు అని నిలదీశారు.

జగన్ కాలిగోటికి సరిపోని చంద్రబాబు వారి నాయకులతో విమర్శిస్తే వైసీపీ నేతలు కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు అని ఆయన హెచ్చరించారు. అందుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాల ఎదుట నిరసన చేపట్టా౦ అని పేర్కొన్నారు. బోస్ డీకే అన్న మాటకు అర్థం మాట్లాడిన వారిని చెప్పమనండి అంటూ వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రిని రెచ్చగొట్టే ప్రయత్నం టీడీపీ నేతలు చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు. తాలిబన్ టు తాడేపల్లి అంటూ ప్రచారం చేశారు.. అని రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ ను  దెబ్బతీస్తున్నారు అంటూ మండిపడ్డారు.

మళ్లీ ఒకసారి రిపీట్ అయితే చంద్రబాబు ఇంటికి  వెళ్లి తంతా౦ అని ఈ బోసిడికే లు ఏం చేస్తారో చూస్తాం అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాజకీయ ఉగ్రవాది.., ఇలాంటి చీడ పురుగులు సమాజంలో రాజకీయం కోసం, ఏదైనా చేస్తారు అని అన్నారు.  టీడీపీ రాష్ట్ర కార్యాలయాలు బంద్ కావాలి తప్పితే ఎవరు షాపులు మూసే అవకాశం లేదని అన్నారు. రేపు భయంతో అనకాపల్లి అడుగు పెట్టడం లేదు.. వస్తే ఆ పిల్లి ఎలా పారిపోయాడు చూద్దురు అని వ్యాఖ్యానించారు. జనసేన అధ్యక్షుడు చంద్రబాబు కంటే ముందు మాట్లాడేస్తున్నాడు ఫ్రీలాన్స్ పొలిటిషన్ అన్నారు ఆయన. అవసరాల కోసం డబ్బులు కోసం మాట్లాడే నాయకుడు అని వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: