ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో నిన్న టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి ఇంటితో పాటు టీడీపీ కార్యాల‌యాలు ఇత‌ర నాయ‌కుల ఇండ్ల పై దాడులు చేసిన ఘ‌ట‌న‌లు రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారాయి. ఈ దాడులతో ఏపీలో రాజ‌కీయా మ‌రోసారి వేడెక్కాయి. ఈ దాడుల నేప‌థ్యంలోనే వైసీపీ టీడీపీ నేత‌లు ఒక‌రిపై మ‌రొక‌రు విమ‌ర్ష‌లు కురిపించుకుంటున్నారు. టీడీపీ నుండి కీల‌క నేత‌లంతా ఈ ఘ‌ట‌న పై ఆగ్ర‌హావేశాల‌కు గురై విమ‌ర్శ‌లు గుప్పిస్తుండ‌గా అదే రేంజ్ లో వైసీపీ నుండి మంత్రులు ఎమ్మెల్యేలు ఫైర్ అవుతున్నారు.
తాజాగా దిగజారుడు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అంటూ మంత్రి క‌న్న‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మాట్లాడకూడని, అసభ్య పదజాలం ఉపయోగిస్తూ ముఖ్యమంత్రిని దూషిస్తున్నారంటూ క‌న్నబాబు మండిప‌డ్డారు. చంద్రబాబు ఇంత దిగజారాడని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు.

సీఎం ను ప‌ట్టుకుని ఇలా మాట్లాడుతారా? అంటూ క‌న్నబాబు ఫైర్ అయ్యారు. భూతులు మాట్లాడటం ఎంత వరకు సమంజసం అంటూ క‌న్న బాబు ప్ర‌శ్నించారు. కండ కావరం, ఒళ్ళు బలిసి కొట్టుకుంటూ మాట్లాడుతున్నారు..అంటూ క‌న్న‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మావాడు తప్పు మాట్లాడాడు అని క్షమించమని అడిగేది పోయి ఇంక సమర్దించుకుంటున్నారని క‌న్న‌బాబు చంద్ర‌బాబు పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అమిత్ షా కు ఫోన్ చేసాడు చంద్రబాబు అని అంటున్నారని....అదే అమిత్ షా కాన్వాయ్ పై దాడి చేసింది చంద్రబాబు కాదా? అంటూ క‌న్న‌బాబు ప్ర‌శ్నించారు.

తండ్రి కొడుకులకు సభ్యత సంస్కారం లేదు అంటూ క‌న్న‌బాబు మండిప‌డ్డారు. ఈ భూతులకు దర్శకత్వం చంద్రబాబే అంటూ వ్యాఖ్యానించారు. కాకినాడ లో కూడా పట్టాభి డ్రామాలు చేశారని...అధికార ప్రతినిది పట్టాభి ఇలా ఎలా మాట్లాడుతున్నారంటూ క‌న్న‌బాబు ప్ర‌శ్నించారు. నిన్నటి నుండి జరుగుతున్న పరిణామాలకు కారణం చంద్రబాబే అంటూ క‌న్న‌బాబు షాకింగ్ కామెంట్లు చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు క్షమాపణ చెప్పాలి అంటూ మంత్రి క‌న్న‌బాబు డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: