జెమినీ టీవీలో ప్ర‌సారం అయిన మీలో ఎవ‌రు కోటీశ్వ‌రులు కార్య‌క్ర‌మం మంచి టాక్ తెచ్చుకున్నా టీఆర్పీ మాత్రం రాలేదు. దీంతో ఈ షో నిర్వ‌హ‌ణ పై ఏవో కొన్ని సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. సీజ‌న్ 2 కు తారక్ రాడ‌న్న టాక్ ఒక‌టి న‌డుస్తోంది. ప్ర‌స్తుతం సీజ‌న్ 1 త‌రువాత ఈ షోలో కంటిన్యూ కాలేన‌ని తారక్ అంటున్నాడ‌ని టాక్. ముందుగా ఆయ‌న ఒప్పందం మేర‌కు సీజన్ 1 కం ప్లీట్ చేశారు. ప్ర‌ముఖుల హంగామా ఎంత ఉన్నా జెమినీ ఆశించిన స్థాయిలో టీఆర్పీలు అందుకోలేక‌పోయింది. దీంతో ఆ సంస్థ కా స్త డీలా పడింది. డిజిట‌ల్ మీడియా ప్ర‌మోష‌న్ బాగున్నా కూడా మీలో ఎవ‌రు కోటీశ్వ‌రులు ఎక్కువ మందికి రీచ్ కాలేదు.  మా టీవీలో హిట్ అయినంతగా ఇక్క‌డ హిట్ కాలేదు. నాగార్జున క‌న్నా తార‌క్ షో నిర్వ‌హ‌ణ‌ను బాగా చేసిన‌ప్ప‌టికీ ఎందుక‌నో టీఆర్పీ ల్లో వెనుక‌బ‌డిపోయింది.

సీజ‌న్ 2 ఇక లేదు
సీజ‌న్ ఒన్ ప్ర‌కారం సీజన్ టు ఉంటుంద‌ని చాలా మంది అనుకున్నా కూడా ఈ సారి ఆ ఛాన్స్ లేనే లేద‌ని తేలిపోయింది. ముఖ్యం గా తార‌క్ నుంచి ఎటువంటి సానుకూల‌తా లేద‌ని తేలిపోయింది. వ‌రుస సినిమాలు చేసేందుకు తార‌క్ ఉవ్విళ్లూరుతుండ‌డంతో ఇక బుల్లి తెర షోల‌కు గుడ్ బై చెప్పాల‌నే నిర్ణ‌యించుకున్నాడు. అంతేకాకుండా ఈ షోకు రావాల్సిన రెస్పాన్స్ రాక‌పోవ‌డంతో చా లా నిరాశ‌లో కూడా ఉన్నాడ‌ని, అది కూడా సీజన్ 2 చేయ‌క‌పోయేందుకు ఓ కార‌ణం అని తెలుస్తోంది. ఆఖరుగా ఎంత‌మంది ప్ర ముఖులు సంద‌డి చేసినా కూడా, తార‌క్ మంచి ఈజ్ చూపినా కూడా షో ఫ్లాప్ అని తేలిపోయింది. ఒక‌వేళ షో కంటిన్యూ చేస్తే తా ర‌క్ త‌రువాత ప్రాజెక్టులు అన్నీ పెండింగ్ లో ప‌డ‌నున్నాయి. వీటిన‌న్నింటినీ దృష్టిలో ఉంచుకుని తారక్ ఈ నిర్ణ‌యం తీసుకున్నా డ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెబుతున్న మాట‌.
 

మరింత సమాచారం తెలుసుకోండి: