- వైసీపీ పెద్దలు
రాష్ట్రంలో టీడీపీ వైసీపీ వర్గాలు తెగ వాగ్వాదాలు పడుతున్నాయి. అధికారంలో ఉన్నా లేకున్నా తాము ప్రజలవైపే అని టీడీపీ చెబుతోంది. ఇదే సమయంలో పాలక పక్షం తప్పిదాలను వెలుగులోకి తెచ్చేందుకు తాము కృషి చేస్తూనే ఉంటామని కూడా చెబుతోంది. అదేవిధంగా ప్రజలకు అందాల్సిన మౌలిక వసతుల కల్పనకు అస్సలు జగన్ కృషి చేయడం లేదని కూడా అంటోంది. ఇవన్నీ ఎలా ఉన్నా కనీసం రోడ్ల మరమ్మతులకు సైతం నిధులు ఇవ్వడం లేదని వాపోతోంది. ఈ క్రమంలో తాము నిరసనలకు ఇంకా ప్రాధాన్యం ఇస్తామని అణిచేస్తే ఇంకా ఇంకా బాగా పనిచేసేందుకు ఉత్సాహం పెంపొందించుకుంటామని కూడా అంటున్నారు సంబంధిత నాయకులు. ఇదే దశలో పాలనపై విపరీతం అయిన వ్యతిరేకత ఉందని కూడా అంటున్నారు పసుపు పార్టీ పెద్దలు.
ఇక వైసీపీ పాలనపై వ్యతిరేకత ఉందా లేదా అన్నది ఓ సారి చూద్దాం. గతంలో కన్నా ఇప్పుడు వైసీపీ పాలన చాలా దీనావస్థలో ఉందని అంటున్నారు టీడీపీ నాయకులు. తమ హయాంలో అభివృద్ధిని నిలుపుదల చేసి, వైసీపీ పంతం నిరూపించుకోవడం తప్ప సాధించిందేం లేదని చెబుతోంది. ఇవన్నీ ఎలా ఉన్నా సంక్షేమ పథకాల అమలులో కొన్ని లోపాలు ఉన్నాయి అని, వాటిపై గొంతెత్తితే అరెస్టులు చేస్తున్నారని వాపోతోంది.