ఇంకా చెప్పాలంటే.......:
ఏపీలో చిత్ర విచిత్ర రాజకీయాలు నెలకొంటున్నాయి. ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం వరకూ నిన్నటిదాకా పరిమితం అయితే ఇప్పుడు భౌతిక దాడులకు సైతం వెనుకడుగు వేయక పోవడంతో ఎప్పటికప్పుడు పరిస్థితులు ఉద్రిక్తతలకు తావిస్తున్నాయి. అ యినా కూడా ఏ పక్షం కూడా తగ్గడం లేదు. గతంలో జగన్ మాట్లాడిన మాటలను బూతులను టీడీపీ రీ ప్లే చేస్తోంది. ఇప్పుడు ప ట్టాభి మాటలను వైసీపీ రీ ప్లే చేస్తోంది. ఎవరికి చెందిన ఛానెళ్లు వారికి ఉండడంతో మీడియాకు ఫుల్ మీల్స్ అందిపోతోంది. దీంతో గంటల తరబడి చర్చకు తావిచ్చేందుకు అవకాశం ఉన్న ఇలాంటి పరిణామాలను మీడియా అస్సలు వదులుకోదు. అవసరం ఉ న్నా,లేకున్నా బాగానే మాట్లాడించాలన్న తపన ఒకటి టీవీ నైన్, ఏబీఎన్, సాక్షి లాంటి ఛానెళ్లకు బాగా ఎక్కువ ఉంది. తప్పేం కాదు రాజకీయ ప్రయోజనాల సిద్ధికి, తమ యాజమాన్యాల నిర్దేశం అనుసారం ఇవి నడుస్తుండడం. ఇప్పుడు తాజాగా వినిపిస్తో న్న మాట ఏంటంటే పట్టాభి ఇంటిపై కానీ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంతో ఇతర టీడీపీ కార్యాలయాలపై దాడులలో జగన్ ప్రమేయం లేనేలేదని చెబుతున్నాయి వైసీపీ వర్గాలు. అవన్నీ భావోద్వేగంలో భాగమని, కోపంలో భాగమని చెబుతున్నాయి. వీ టిని ఎలా అర్థం చేసుకోవాలి?