ఈ సర్వే హుజూరాబాద్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధిస్తారని చెబుతోంది. మొత్తం ఐదు మండలాల్లో 1100 మందిని సర్వే చేసి ఈ ఫలితాలు రూపొందించినట్టు ఆ సంస్థ చెప్పినట్టు సోషల్ మీడియాలో ఓ కథనం సర్క్యులేట్ అవుతోంది. అయితే ఇందులో వాస్తవం ఎంతన్నది మాత్రం నిర్థరణ కాలేదు. అయితే హుజూరాబాద్ ఫలితంపై ఓటర్లలో నెలకొన్న ఉత్కంఠ కారణంగా ఈ కథనం ఆసక్తికరంగా మారింది.
ఈ సర్వేలో 49.4 శాతం మంది ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపినట్టు ఈ సోషల్ మీడియా కథనం చెబుతోంది. అలాగే.. టీఆర్ఎస్ వైపు 34.12 శాతం మొగ్గుచూపుతున్నారని ఈ సోషల్ మీడియా కథనం చెబుతోంది. ఇక కాంగ్రెస్ వైపు 16.49 శాతం మంది మొగ్గు చూపుతున్నారని ఈ సోషల్ మీడియా కథనం చెబుతోంది. జమ్మికుంట, హూజూరాబాద్, వీణవంక, కమలాపూర్, ఇల్లందకుంట మండలాల్లో ఈ సర్వే నిర్వహించారని ఈ సోషల్ మీడియా కథనం చెబుతోంది.
ఇప్పుడు ఈ సర్వే ఫలితాన్ని బీజేపీ వర్గాలు జోరుగా సోషల్ మీడియాలో తిప్పుతున్నాయి. అయితే ఎన్నికల సమయంలో ఇలాంటి సర్వేలు ఎన్నో వస్తుంటాయని.. వాటిలో ఏది వాస్తవమో చెప్పలేమని విశ్లేషకులు అంటున్నారు. ఆయా సంస్థల అసలు వెబ్ సైట్లలోకి వెళ్లి ఈ సర్వేల గురించి చెక్ చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ఏదైమైనా అసలు ఫలితం మాత్రం నవంబర్ 2 న రాబోతుంది. అప్పుడు తేలుతుంది అసలు హుజూరాబాద్ విజేత ఎవరో..? అప్పటి వరకూ ఇలాంటి సర్వేల షికార్లు, పుకార్లు తప్పదు కదా.