రాష్ట్రం విడిపోయాక మంచి నాయకత్వం కావాలన్న తలంపుతో టీడీపీని ఎన్నుకున్నారు ప్రజలు. ఆ రోజు చంద్రబాబు మొదలుకుని మిగతా నాయకులంతా ప్రజల ఆమోదం పొందారు. మెప్పు పొందారు. అదేవిధంగా టీడీపీ నాయకులకు అండగా అన్ని చోట్ల ప్రజలు నిలిచారు. తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ సాక్షిగా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ రోజు జగన్ ను టార్గెట్ చేసుకుని చంద్రబాబు మనుషులు అసెంబ్లీలో అనేకానేక రీతుల్లో అనేకానేక మాటలు వినిపించారు. అదేవిధంగా తెలుగుదే శం మంత్రులు చంద్రబాబు ఆజ్ఞలతో అస్సలు జగన్ ను మాట్లాడనివ్వక సభను రణరంగాన్ని తలపించేలా మార్చేశారు.
ఇదే సమ యంలో వైసీపీ కూడా ఎదురు దాటికి దిగి తన పంతం నెగ్గించుకునే ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రోజా కూడా అ నుచిత వ్యాఖ్యలు చాలానే చేశారు. ఇవన్నీ ఆ రోజు జరిగిన పరిణామాలకు సంకేతంగా నిలిచి, మొత్తం ప్రజా స్వామ్య వ్యవస్థనే ని వ్వెర పరిచాయి. ఇప్పుడు సీన్ మారింది. జగన్ అధికారంలోకి వచ్చారు. వచ్చిన నాటి నుంచి తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తు న్నారు. పంతం నిలుపుకునే పనులేవో చేస్తున్నారు.