విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు గానూ నేడు అమరవీరుల దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల పోలీస్ శాఖలు. విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన వారికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని రెండు రాష్ట్రాల డీజీపీ లు అన్నారు. ఇక నేడు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పోలీసు అమరవీరుల దినోత్సవంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు. 11 మంది పోలీసులు మన రాష్ట్రంలో, 377 మంది దేశంలో మరణించారు అని ఆయన కొనియాడారు.

అభద్రత భావం దూరం చేస్తూ ఏకాగ్రతతో పని చేయడం ప్రతీ పోలీసు పని అని అన్నారు ఆయన. కాలం పోలీసు విధులకు కొలమానం కాదు అని స్పష్టం చేసారు. అన్ని రకలుగా సామాజిక భద్రతకు పనిచేయడమే పోలీసుల విధి అని తెలిపారు. పోలీసుల సంక్షేమానికి సీఎం జగన్ జారీ చేసిన పధకాలు విలువైనవి అని అన్నారు. వీక్లీ ఆఫ్ పోలీసులకు ఇవ్వాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని ప్రతీ పోలీసు అభినందించాలి అని కోరారు. 15 కోట్ల నిధులు సీఎం జగన్ పోలీసు సంక్షేమనికి విడుదల చేయాలని కోరుతున్నాం అని పేర్కొన్నారు.

కోవిడ్ కాలంలో ప్రాణాలర్పించిన వారికి ఒకొక్కరికి 5 లక్షలు అదనంగా ఇవ్వడం అభినందనీయం అన్నారు డీజీపీ. హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ పోలీసు అమరవీరులను స్మరించుకునే ఈ దినోత్సవం చాలా గొప్పది అని అన్నారు. పోలీసు ఉద్యోగాన్ని వృత్తిలా కాకుండా, సేవలా భావించే పోలీసులు ఎందరో అని ఆమె కొనియాడారు. 21 రోజుల్లో దిశ చట్టం ద్వారా నిందితులను కటకటాలకు పంపవచ్చు అని అన్నారు. పోలీసులకు మౌలిక సదుపాయాలు కల్పించారు సీఎం జగన్ అని కొనియాడారు. గ్రామ స్ధాయిలో మహిళ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ 15వేల మందిని మహిళా పోలీసులుగా గుర్తించాం అన్నారు ఆమె. పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది అని స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

dgp