ఇక నరసారావుపేట సీటు కోసం రాయపాటి ఫ్యామిలీ నుంచే ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే నరసారావు పేట సీటు రాయపాటి ఫ్యామిలీ కి ఇస్తారా ? లేదా ? అన్నది సత్తెనపల్లి సీటుతో ముడి పడి ఉందనే చెప్పాలి. ఆ ఫ్యామిలీ నుంచి రాయపాటి వారసుడు రంగా రావు కు సత్తెనపల్లి సీటు ఇస్తే నరసారావుపేట సీటు ఇతరు లకు ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక రాయపాటి ఫ్యామిలీకే చెందిన రాయపాటి శైలజ పేరు కూడా నరాసరావు పేట పార్లమెంటు స్ధానానికి గట్టిగా వినపడుతోంది. ఆమె అమరావతి ఉద్యమం ద్వారా బాగా పాపులర్ అవ్వడం తో పాటు పార్టీ లతో సంబంధం లేకుండా స్థానికంగా మంచి పేరు తెచ్చుకున్నారు.
ఇక బాపట్ల లోక్సభ స్థానం నుంచి టీడీపీ నుంచి పార్టీ సీనియర్ వర్ల రామయ్య పేరు ముందు వినిపించింది. అయితే ఆయన తనయుడు కుమార్ రాజాకు పామర్రు సీటు ఇవ్వడంతో ఇప్పుడు కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, శలగల రాజశేఖర్ ( మాజీ ఎంపీ శలగల బెంజిమన్ తనయుడు) పేర్లు ప్రముఖంగా తెర మీదకు వస్తున్నాయి.