ఈ క్రమంలోనే గుంటూరు నగరం లో గుంటూరు వెస్ట్ సీటు కోసం కూడా పార్టీలో అనేక మంది నేతలు పోటీ పడుతున్నారు. గత ఎన్నికలలో అక్కడ నుంచి పోటీ చేసిన మద్దాలి గిరిధర్ రావు విజయం సాధించారు. ఇంత వ్యతిరేక గాలులను ఎదుర్కొని కూడా గిరి 12 వేల ఓట్ల మెజార్టీతో సంచలన విజయం సాధించారు. అయితే ఆ తర్వాత ఆయన వైసీపీ గూటికి చేరిపోయారు. ఇక ఇప్పుడు పశ్చిమ ఇన్ చార్జ్గా కోవెల మూడి రవీంద్ర ( నాని ) ని చంద్రబాబు నియమించారు. అయితే ఆయనకే వచ్చే ఎన్నికల్లో పశ్చిమ సీటు వస్తుందా ? అన్నది గ్యారెంటీ లేదు.
ఆయనతో పాటు రాయపాటి సాంబశివ రావు తనయుడు రంగారావు పేరు కూడా వినిపిస్తోంది. ఆయనతో పాటు పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీథర్ వచ్చే ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మీదే కన్నేసి ఇక్కడ రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. అలాగే తెనాలి నియోజకవర్గ ఇన్ చార్జ్ గా ఉన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ సైతం గుంటూరు పశ్చిమం కోసం ప్రయత్నాలు అయితే ప్రారంభించారట. మరి వీరిలో ఎవరికి పశ్చిమం సీటు లక్ చిక్కుతుందో ? చూడాలి.