ఆంధ్రప్రదేశ్ పరిణామాలపై పక్క రాష్ట్రం తెలంగాణలోనూ చర్చలు నడుస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ వీటిపై కామెంట్లు విని పిస్తున్నాయి. పలువురు వ్యాసాల రూపంలో తమ అభిప్రాయాలు వినిపిస్తున్నారు. తిట్ల సంస్కృతి ఉమ్మడి ఆంధ్రాలోనూ ఉంది అని దామోదరం సంజీవయ్య హయాంలోనూ ఇలాంటి మాటలే వినిపించాయి అని విశ్లేషకులు అంటున్నారు. అప్పట్లో నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మంత్రి కులం పేరుతో దూషణ సాగించారని రాజకీయ విశ్లేషకులు నాంచారయ్య మెరుగుమాల అంటున్నారు.
ఆయనేం అంటున్నారంటే.. "కర్నూలు జిల్లాకు చెందిన మొదటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్యను కాబినెట్ సమావేశంలో నెల్లూరుకు చెందిన సీనియర్ మంత్రి కులం పేరుతో బూతులు తిట్టిన ఘన చరిత్ర మన 'ఉమ్మడి' ఆంధ్రప్రదేశ్ కు ఉంది. ఇప్పుడు అవశేష ఆంధ్రలో తెలుగు నేత ఒకరు ప్రస్తుత సీఎంను జాతీయస్థాయి ఉత్తరాది తిట్టుతో దూషించడం ఎంతైనా ' మెరుగైన రాజకీయ సంస్కృతి' కి అద్దం పడుతోంది..."అని చెప్పారు.. సోషల్ మీడియాలో తన పోస్టు ద్వారా..