ఇన్నాళ్లూ ఓపిగ్గా ఉన్నాం, ఇంకా ఓపికతో ఉండలేని పరిస్థితి ఏర్పడింది అని మాకూ బీపీ వస్తుంది.. మేం ఏం చేస్తామో త్వరలో చూపిస్తాం అని టీడీపీ సీనియ‌ర్ నేత ప‌రిటాల సునీత తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీ పార్టీ కార్యాల‌యం దాడి, త‌మ నేత‌ల‌పై  వైసీపీ నేత‌లు మాట్లాడుతున్న తీరు పై ఆమె మండిప‌డ్డారు. అమ‌రావ‌తిలో ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడారు టీడీపీ సీనియ‌ర్ నేత ప‌రిటాల సునీత‌. గ్రామాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నాం అని అన్నారు.
 

పార్టీ ఆఫీస్ పక్కనే డీజీపీ కార్యాలయం ఉంది అయినా దాడి చేసిన వాళ్ల‌ను ఆప‌లేక‌పోయార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గతంలో మేం పోలీస్ విభాగాన్ని వాడుకుని ఉంటే.. వైసీపీ గుండాలు మిగిలి ఉండేవాళ్లు కాదు అని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. పరిటాల రవిని పొట్టన పెట్టుకున్నా.. అధికారంలో వచ్చాక శాంతిగా ఉండమని చంద్రబాబు చెప్పారు అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆనాడే చంద్రబాబు కన్నెర్ర చేసి ఉంటే.. ఒక్కరు కూడా మిగిలి ఉండే వారు కాదు అని హెచ్చ‌రించారు. పరిటాల రవిని చంపిన వాళ్లు రోడ్ల మీద తిరుగుతోన్నా చంద్రబాబు మీద గౌరవంతో గొడవలు పెట్టుకోలేదు అని తెలిపారు.



మారిన చంద్రబాబు కావాలని,  తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్య‌క్తం చేశారు. అధికారంలోకి వచ్చాక గంట కళ్లు మూసుకుంటే చాలు అని కోరారు. త‌మ రక్తం ఉడుకుతోంది ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇప్పుడైనా సరే మీ పని మీరు  చేయండని చెబితే మంత్రులను తిరగనివ్వం అని హెచ్చ‌రించారు ప‌రిటాల సునీత‌. మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్రబాబు కాళ్ల కింద ఉండే వ్యక్తులు వంశీ, నాని వంటి వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని మండిప‌డ్డారు. తిట్లు మాకూ వచ్చు.. మేమూ మాట్లాడగలం అని ఈ సంద‌ర్భంగా హెచ్చ‌రించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: