ఢిల్లీలో బాబు మాట నెగ్గేనా?
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడులు చేసిన జగన్ అభిమానులెవ్వరినీ డీజీపీ అరెస్టు చేయలేకపోయారని టీడీపీ మం డి పడుతోంది. ఇదే సందర్భంలో రాష్ట్రపతి పాలన విధించాలని కూడా కోరుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఆర్టికల్ 356ను ఇంపోజ్ చేయడం సాధ్యం కాదని తేలిపోయింది. అసాధారణ పరిస్థితుల నేపథ్యంలోనే రాష్ట్రపతి పాలన ఉండనుంది. ఇక ఢిల్లీ కేం ద్రంగా లాబీయింగ్ నడిపేందుకు అక్కడికి బాబు వెళ్లనున్నారు. పూర్వ స్నేహాల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ దశలో మోడీ మాత్రం బాబుపై ప్రేమ చూపిస్తారని అనుకునేందుకు వీల్లేదని తేలిపోయింది. గతంలో పరిణామాలు ఎలా ఉన్నా మోడీ తనదైన పంథాలో బాబుతో మాట్లాడి పంపిస్తారని అంతకుమించి పెద్దగా మార్పు ఏమీ ఉండదని కూడా తెలుస్తోంది. ప్రస్తు తం మోడీ చూపు అంతా జగన్ వైపే ఉంది కనుక చంద్రబాబుకు అండగా ఆయన ఉండరని, అపాయింట్మెంట్ వరకూ ఏ ఇబ్బందీ తలెత్తకపోయినా భేటీ తరువాత చంద్రబాబుకు అనుకూలంగా బీజేపీ బాస్ ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వరని నిర్థారణ అవుతోంది.