హైకోర్టు విధానాన్ని తప్పుబడుతూ.... సుప్రీంకోర్టును హెచ్సీఏ, బడ్జింగ్ స్టార్ క్రికెట్ క్లబ్ ఆశ్రయించాయి. ఈ పిటిషన్పై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. హెచ్సీఏ వ్యవహారాలపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రికెట్లో ప్రస్తుతం ఆటకు బదులుగా రాజకీయాలు ఎక్కువయ్యాయని వ్యాఖ్యానించారు. అసలు అసోసియేషన్లో ఏం జరుగుతోందని ప్రశ్నించిన ధర్మాసనం.... మొత్తం వ్యవహారంపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపిస్తామని హెచ్చరించింది. ప్రస్తుత మేనేజ్మెంట్ నుంచి రెండు గ్రూపులు బయటకు వెళ్లిపోవాలని ధర్మాసనం ఆదేశించింది. న్యాయవ్యవస్థను కూడా వివాదాల్లోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారని.... ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు అవసరమని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేశారు. ఈ లోపు విచారణ కోసం మాజీ న్యాయమూర్తుల పేర్లను ఎంపిక చేస్తామని ధర్మాసనం అభిప్రాయపడింది.
హైకోర్టు విధానాన్ని తప్పుబడుతూ.... సుప్రీంకోర్టును హెచ్సీఏ, బడ్జింగ్ స్టార్ క్రికెట్ క్లబ్ ఆశ్రయించాయి. ఈ పిటిషన్పై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. హెచ్సీఏ వ్యవహారాలపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రికెట్లో ప్రస్తుతం ఆటకు బదులుగా రాజకీయాలు ఎక్కువయ్యాయని వ్యాఖ్యానించారు. అసలు అసోసియేషన్లో ఏం జరుగుతోందని ప్రశ్నించిన ధర్మాసనం.... మొత్తం వ్యవహారంపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపిస్తామని హెచ్చరించింది. ప్రస్తుత మేనేజ్మెంట్ నుంచి రెండు గ్రూపులు బయటకు వెళ్లిపోవాలని ధర్మాసనం ఆదేశించింది. న్యాయవ్యవస్థను కూడా వివాదాల్లోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారని.... ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు అవసరమని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేశారు. ఈ లోపు విచారణ కోసం మాజీ న్యాయమూర్తుల పేర్లను ఎంపిక చేస్తామని ధర్మాసనం అభిప్రాయపడింది.