విశాఖపట్నం :  తెలుగు దేశం పార్టీ నేతలు మరియు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై ఓ రేంజ్ లో రెచ్చిపోయాడు మంత్రి అవంతి శ్రీనివాసరావు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో చంద్రబాబు అశాంతి, అలజడిని సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి అవంతి. తన తనయుడు లోకేష్ ను ముఖ్యమంత్రి ని చెయ్యాలి అని చూస్తున్నారని..  గంజాయి వ్యవహారం ఇప్పటిది కాదని నిప్పులు చెరిగారు మంత్రి అవంతి. 1970 లో గంజాయి మొదటి కేసు నమోదు అయిందని.. టీడీపీ పార్టీ అధికారం లో ఉన్న సమయం లో మంత్రులు గంటా, అయ్యన్న ఒక్కసారి అయిన ఏజెన్సీ వెళ్ళారా.. ? అని నిలదీశారు మంత్రి అవంతి.  గంజాయి డాన్ అయ్యన్న ను ప్రక్కన పెట్టుకొని చంద్రబాబు గంజాయి కోసం మాట్లాడడం హాస్యాస్పదమని చురకలు అంటించారు మంత్రి అవంతి.  

చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ పై చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తా.. లేకపోతే చంద్రబాబు రాజీనామా చేస్తారా.. ? అని ఓ రేంజ్ లో అడుకున్నారు మంత్రి అవంతి.   టీడీపీ లో గెలిచి లోకేష్ బాధ తట్టుకోలేక కొందరు ఎమ్మెల్యే లు మాతో ఉన్నారని.. జగన్ కు వస్తున్న మంచి పేరు చూడలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి అవంతి. సొంత మామా ను చంపి పార్టీ ని చేతుల లోకి తీసుకున్నారని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు కు చురకలు అంటించారు మంత్రి అవంతి.  

హత్య రాజ కీయాలు చంద్రబాబు కి వెన్న తో పెట్టిన విద్య అన్నారు మంత్రి అవంతి. చంద్రబాబు వెంటనే  ముఖ్యమంత్రి జగన్ కు తక్షణమే క్షేమపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి అవంతి. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఒకవేళ... క్షమాపణ చెప్పని ఎడల తామేంటో చంద్రబాబు నాయుడుకు చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు మంత్రి అవంతి శ్రీనివాస్ రావు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే కనుమరుగు కావడం పక్క అని తెలిసే ఇలాంటి సంఘటలను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తున్నారు అని మండిపడ్డారు మంత్రి అవంతి శ్రీనివాసరావు.

మరింత సమాచారం తెలుసుకోండి: