రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో రోడ్లు, డ్రేనేజీ, మరుగుదొడ్లు, స్మశాన వాటికల నిర్మాణం సహా అభివృద్ది, సంక్షేమ పథకాలకు కేంద్రం ఇచ్చే నిధులను దారి మళ్లించి ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు ఖర్చు పెడుతున్నరు. కమలం పువ్వు గుర్తు వాళ్లు ఇంత పెద్ద ఎత్తున నిధులిస్తుంటే, కనీసం నరేంద్రమోదీ గారి పేరును ప్రస్తావించని సిగ్గులేని నేతలు టీఆర్ఎసోళ్లు. హుజూరాబాద్ ప్రజలందరికీ టీఆర్ఎస్ సంగతి అర్ధమైంది. రాష్ట్రంలో ఈ మూర్ఖుడి పాలనతో ఆగమైపోతున్నరు. వాళ్లంతా హుజూరాబాద్ ప్రజలకు చేతులు జోడించి మొక్కుతున్నరు. టీఆర్ఎస్ దోపిడీ పాలన అంతం కావాలని, కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని కోరుతున్నరు. 30న జరిగే పోలింగ్ లో కమలం పువ్వు గుర్తుకు అందరూ ఓటేసి టీఆర్ఎస్ బాక్సులు బద్దలు కొట్టాలి. కేసీఆర్ మైండ్ షాక్ కావాలి.
వచ్చే నెల 2న ‘ట్రిపుల్ ఆర్ సినిమా’ను ప్రగతి భవన్ ముందు ప్రొజెక్టర్ పెట్టి కేసీఆర్ కు చూపిస్తాం. అందులో ఒక ఆర్.. రాజాసింగ్.. రెండో ఆర్.. రఘునందన్ రావు....ఇక గెలవబోయే మూడో వ్యక్తి రాజేందర్...ఈ ముగ్గురితో ‘ట్రిపుల్ ఆర్’ సినిమా చూపించబోతున్నం. ఈ సినిమా చూపించాలంటే ఈటల రాజేందర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి.