కాగా హుజురాబాద్ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న కొద్ది ఆయా పార్టీల నేతలు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. దీంతో ఆ నియోజకవర్గం అంతటా రాజకీయ వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో హుజురాబాద్లో వీ హన్మంతరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఉప ఎన్నిక కోసం డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. తెలంగాణ వ్యాప్తంగా దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశామని, కొన్ని కులాలవారు అడుక్కునే పరిస్థితిలో ఉన్నారని అలాంటి వారికి కూడా దళిత బంధు ఇవ్వాలన్నారు హన్మంతరావు.
బీజేపీ నేత ఈటలకు మంచి పేరు ఉండేదని ఎందుకు బీజేపీలోకి వెళ్లారో తెలియదని ప్రశ్నించారు. తెలంగాణ కోసం పోరాడాడని, ఇండిపెండెంట్గా పోటీ చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. దేశాన్ని నాశనం చేస్తున్న బీజేపీలో చేరితే ఓటు ఎలా వేయాలని ప్రశ్నించారు విహెచ్. బీజేపీ ఏం అభివృద్ధి చేసిందని ప్రశ్నించారు. బేటీ బచావో పడావో అంటున్న బీజేపీ ప్రభుత్వ హయాంలో రోజుకో రేప్ జరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.