అలాగే, 36 గంటల పాటు చంద్రబాబు దీక్ష చేపడితే, దానికి కౌంటర్గా వైసీపీ జనాగ్రహ దీక్ష చేపట్టింది. ఇవన్ని వెరసి ఏపీ రాజకీయాల్లో వేడెక్కింది. అలాగే ఒకరిపై ఒకరి తీవ్ర దూషణలు చేయడం మొదలు పెట్టారు. దీంతో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర పతి పాలన విధించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఏకంగా టీడీపీ గుర్తింపునే రద్దు చేయాలి వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు ఈ డిమాండ్లు సాధ్యమేనా అనేది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. టీడీపీ గుర్తింపును రద్దు చేయడం అనేది కేవలం ఒక అధికార ప్రతినిధి దూషించడం మాత్రమే.
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పార్టీల మధ్య దూషణలు సాధారణమే.. దూషణల కారణంగా పార్టీ గుర్తింపును రద్దు చేయడం అంటే దేశంలో పార్టీలేమీ ఉండవు. అలాగే టీడీపీ డిమాండ్ ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని. ఈ క్రమంలో రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రికి చంద్రబాబు నాయుడు స్వయంగా 39 పేజీలతో కూడిన లేఖలను పంపించారు.