షర్మిల తెర వెనక తన టీం తో పాటు అక్కడ ఉన్న తమ పార్టీ శ్రేణులకు కూడా బీజేపీ క్యాండెట్ అయిన ఈటల రాజేందర్ కు సపోర్ట్ చేయాలని సంకేతాలు పంపినట్టు తెలుస్తోంది. షర్మిల పార్టీ పెట్టిన ప్పటి నుంచి కూడా ప్రధానంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మాత్రమే టార్గెట్ చేస్తూ వస్తున్నారు. కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీ ని కాని.. కాంగ్రెస్ ను కాని పెద్దగా విమర్శించడం లేదు. ఈ క్రమంలోనే హుజూరా బాద్లో కేవలం అధికార టీఆర్ ఎస్ ను ఓడించాలని కసితో ఉన్న మిగిలి న పార్టీ ల బాటలోనే ఇప్పుడు షర్మిల కూడా బీజేపీ కే లోపాయి కారి మద్దతు ఇస్తున్నారట.
ఎలాగైనా కేసీఆర్ ను గద్దె దించాలన్న లక్ష్యంతో నే అక్కడ షర్మిల ప్లాన్ వేస్తున్నారట. ఈ క్రమంలోనే ఆమె వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో కూడా పొత్తు పెట్టుకుంటారని ఓ ప్రచారం జరుగుతోంది. మరో టాక్ ప్రకారం ఆమె బీజేపీ తో కలిసినా ఆశ్చర్య పోనక్కర్లేదని అంటున్నారు. ఈ ప్రచారాలు ఎలా ? ఉన్నా కూడా షర్మిల ఈ నెల 20 నుంచి పాదయాత్ర కూడా ప్రారంభించనున్నారు.