ఓ వైపు వరదలు... మరోవైపు కరోనా వైరస్ కేరళను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కేరళను వరదలు ముంచెత్తి సరిగ్గా వారం రోజులు కూడా కాలేదు. అరేబియా మహా సముద్రంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో... కేరళ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురిశాయి. వరదలకు ఏకంగా 50 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వందల మంది గల్లంతయ్యారు. రాష్ట్రంలోని అన్ని డ్యామ్లు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఏకంగా 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావారణ శాఖ. దీని నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళపై ఇప్పుడు కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు సగం కేసులు కేరళలోనే ఉన్నాయి. 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 16 వేల కేసులు దేశ వ్యాప్తంగా నమోదైతే... అందులో 9 వేల 500 కేసులు ఒక్క కేరళలోనే ఉన్నాయి. అయితే మరణాల రేటు మాత్రం అత్యంత తక్కువ స్థాయిలోనే ఉంది. ఇప్పటికే కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ... వైరస్ పాజిటివ్ కేసులు పెరగడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఓ వైపు వరదలు... మరోవైపు కరోనా వైరస్ కేరళను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కేరళను వరదలు ముంచెత్తి సరిగ్గా వారం రోజులు కూడా కాలేదు. అరేబియా మహా సముద్రంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో... కేరళ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురిశాయి. వరదలకు ఏకంగా 50 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వందల మంది గల్లంతయ్యారు. రాష్ట్రంలోని అన్ని డ్యామ్లు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఏకంగా 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావారణ శాఖ. దీని నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళపై ఇప్పుడు కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు సగం కేసులు కేరళలోనే ఉన్నాయి. 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 16 వేల కేసులు దేశ వ్యాప్తంగా నమోదైతే... అందులో 9 వేల 500 కేసులు ఒక్క కేరళలోనే ఉన్నాయి. అయితే మరణాల రేటు మాత్రం అత్యంత తక్కువ స్థాయిలోనే ఉంది. ఇప్పటికే కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ... వైరస్ పాజిటివ్ కేసులు పెరగడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.