టీడీపీ-వైసీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. త‌మ‌ల‌పాకుతో నువ్వొక‌టంటే.. త‌లుపు చెక్క‌తో నే రెండెంటా! అనే రేంజ్‌లో నాయ‌కులు దూకుడుగా దూష‌ణ‌ల ప‌ర్వాన్ని కొన‌సాగిస్తున్నారు. ఒక‌రికి ఒక‌రు కౌంట‌ర్ ఇచ్చుకుంటున్నారు. నువ్వు ఇలా అంటే.. నేను ఇలా అంటా అంటూ.. నాయ‌కులు.. విమ‌ర్శ‌ల ప‌ర్వం కొన‌సాగిస్తున్నారు. తాజాగా.. కృష్ణాజిల్లా గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే, టీడీపీ  మాజీ నాయ‌కుడు వ‌ల్ల‌భ‌నేని వంశీ.. లోకేష్‌పైనా.. చంద్ర‌బాబుపైనా.. అదేస‌మ‌యంలో పార్టీ కార్య‌క‌ర్త‌లపైనా చేసిన వ్యాఖ్య‌ల‌కు వినుకొండ మాజీ ఎమ్మెల్యే , గుంటూరు జిల్లా టీడీపీ ఇంచార్జ్ జీవీ ఆంజ‌నేయులు గ‌ట్టి కౌంట‌రే ఇచ్చారు.

తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ``వంశీ ప‌శువుల డాక్ట‌ర్ అనుకున్నాం. అయితే.. ఆయ‌న ప‌శువుల డాక్ట‌ర్ కాదు. ప‌శువుకంటే హీనం`` అని నిప్పులు చెరిగారు. ఆంజ‌నేయులు సైలెంట్‌గా మాట్లాడుతూనే వంశీపై నిప్పులు చెరిగారు. చంద్ర‌బాబు ను వంశీ దూషించడం వెనుక ఎవ‌రున్నారో.. చెప్పాల‌ని నిల‌దీశారు. జ‌గ‌న్ ప్రొత్బ‌లంతోనే .. వంశీ ఇలా కామెంట్లు చేశార‌ని అన్నారు. వంశీ అత్యంత దారుణంగా త‌యార‌య్యాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తిన్నింటివాసాలు లెక్క‌పెట్టేవారిని చూశాన‌ని.. కానీ.. వంశీ కూడా అలాంటోడేన‌ని.. ఇప్పుడు తెలిసింద‌ని జీవీ అన్నారు. రాజ‌కీయంగా ఎవ‌రైతే.. వంశీకి పొలిటిక‌ల్ భిక్ష పెట్టారో.. ఆయ‌న చంద్ర‌బాబు ఇంటి వాసాల‌నే లెక్క‌పెడుతున్నార‌ని అన్నారు.

అంతేకాదు.. కుక్క‌క‌న్నా విశ్వాసం ఉంటుంద‌ని.. కానీ.. ఇలాంటి కుక్క‌ల‌కు విశ్వాసం లేద‌ని.. ప‌రోక్షంగా జీవీ ఆంజ‌నేయులు.. నిప్పులు చెరిగారు. `` ఏం మాట్లాడుతున్నావ్‌. నీ వెనుక ప్రోత్స‌హించేది ఎవ‌రు? ఈ ర‌కంగా మాట్లాడుతున్నావంటే.. నీ వెనుక ఎవ‌రున్నారు. జ‌గ‌న్ రెడ్డి వంటి వారు ఇలాంటి కుక్క‌ల్ని ప్రోత్స‌హించ‌డం క‌రెక్టా?  నోటికొచ్చిందల్లా మాట్లాడ‌తారా? ప‌శువు కంటే హీన‌మైన వంశీ వంటివారిని ప్రోత్స‌హించి మాట్లాడిస్తోంది ఎవ‌రు? జ‌గ‌నే!!`` అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. వంశీ చేస్తున్న వ్యాఖ్య‌లు.. అంటున్న మాట‌లు.. విని త‌ల్లులు బాధ‌ప‌డుతున్నార‌ని.. జీవీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ముఖ్యంగా వంశీ త‌ల్లి.. ఇలాంటి ద‌రిద్రుణ్ని ఎందుకు క‌న్నానా? అని త‌ల‌బాదుకుంటోంద‌న్నారు.

ఇక‌, వంశీ భార్య కూడా అలాంటి మాట‌లు విన‌లేక‌.. బాధ‌ప‌డుతోంద‌ని జీవీ ఆంజ‌నేయులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇలాంటి వెధ‌వ‌ను నేను ఎందుకు చేసుకున్నానా? అని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంద‌న్నారు. చెప్పుల‌తో మ‌హిళ‌లు మిమ్మ‌ల్ని.. రోడ్డు మీద త‌రిమి త‌రిమికొట్టే రోజులు ద‌గ్గ‌ర ప‌డ్డాయ్‌!! అని జీవీ హెచ్చ‌రించారు. వంశీ లాంటి వాళ్ల‌కి, వీధి రౌడీల‌కి, ఇలాంటి వారికి చెప్పుల‌తో కొట్టే రోజులు ముందున్నాయ‌ని వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికైనా నోరు అదుపులో పెట్టుకోక‌పోతే.. ప్ర‌జ‌లు వీపులు ప‌గ‌ల‌గొడ‌తార‌ని.. జీవీ హెచ్చ‌రించారు. ఈ రాష్ట్రం నుంచి పారిపోయే రోజులు ద‌గ్గ‌ర ప‌డ్డాయ‌ని గుర్తించుకోవాల‌ని.. తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరిగారు. ప్ర‌జ‌లు తిరుగుబాటు చేస్తే.. అడ్ర‌స్ దొర‌క‌ర‌ని హెచ్చ‌రించారు. ప్ర‌స్తుతం జీవీ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో భారీ ఎత్తున వైర‌ల్ అవుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రిదీనికి వంశీ ఎలా కౌంట‌ర్ ఇస్తారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: