ఇలాంటివి చేస్తుంది కనుకనే భారత్ ఆ దేశంతో ఇప్పటివరకు చేసిన భారీ వాణిజ్య ఒప్పందాలను ఇక మీదట చేసుకోకుండానే నిర్ణయానికి దాదాపు వచ్చేసింది. గతంలో కూడా లఢక్ లో చేసిన దానికి అనేక చైనా యాప్ లను భారత్ నిషేదించింది. ఇక వాణిజ్యం కూడా వద్దనుకుంటే, చైనాతో పూర్తిగా సంబంధాలు తెగిపోయినట్టే. అంటే 90 బిలియన్ డాలర్ల పైగా చైనాతో వాణిజ్యం ఇక మీదట ఉండబోదు. భారత్ లోనే ఆయా వస్తు ఉత్పత్తికి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ప్రపంచ దేశాలు కూడా భారత్ వైపు మొగ్గు చూపుతున్నాయి. కరోనా సహా పలు అంశాలలో చైనా పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా దిగజారిపోయింది. అందుకే రానున్న రెండేళ్లలో భారత్ అవకాశాలను పొందనున్నట్టు నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు.
చైనా ఎన్ని గిమ్మిల్కులు చేసినప్పటికీ భారత్ లోని ఒక్క సెంటీమీటర్ కూడా భూభాగాన్ని ఎవరికి ఇచ్చేది లేదని ప్రభుత్వం కూడా స్పష్టత ఇచ్చింది. చైనా తన కన్ను పడ్డ ప్రాంతాలను తనవే అంటూ ఇష్టానికి మాట్లాడితే ఊరుకునే వాళ్ళు ఎవరు ఇక్కడ లేరనే సమాచారాన్ని కూడా ఇటీవల అరుణాచలప్రదేశ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఘాటుగా స్పందించింది.