దాదాపు మూడేళ్ళ తర్వాత ఆయన ఢిల్లీ టూర్ కు వెళ్ళారు. ఇక ఢిల్లీ కి చేరుకున్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు... పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ తో సమావేశం అవుతారు చంద్రబాబు. ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరనున్న చంద్రబాబు నాయుడు... ఇచీవల టీడీపీ కార్యాలయం పై జరిగిన దాడులు, టీడీపీ కార్యకర్తలు, నాయకుల నిర్బంధాలు, వేధింపులు పై సిబిఐ దర్యాప్తు ను కోరే అవకాశం ఉందని అంటున్నారు.
ఏపీ లో శాంతి భద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయని, డిజిపి తో సహా పోలీసు వ్యవస్థ పూర్తిగా అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వివరించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రపతికి ఒక వినతీ పత్రం కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. విజ్ఞాపన పత్రంలో గంజాయ్, హెరాయన్ అంశాలను కూడా ఆయన వివరించే అవకాశం ఉంది. • ప్రధాని మోడి, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా లను కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అని మీడియా అంటుంది. అయితే వాళ్ళు కలుస్తారా లేదా అనేది తెలియాలి. ఒక బిజెపి రాజ్యసభ ఎంపీ చంద్రబాబుకి ఢిల్లీ లో సహకరిస్తున్నారు అని సమాచారం.