ఏపీలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ వాళ్ళ మీద దాడులకు దిగిన తర్వాత రాజకీయం ఏ మలుపు తిరిగే అవకాశం ఉందనే దానిపై అందరూ ఆలోచిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ కి కూడా వెళ్లి రాష్ట్రపతిని కూడా కలుస్తున్నారు. అక్కడ ఏ పరిణామాలు ఉండబోతున్నాయి అనేదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఇక చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీని అలాగే హోం మంత్రి అమిత్ షా ని కలిసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఆ ఘటన తర్వాత టీడీపీ గుర్తింపు ని ఎన్నికల సంఘం రద్దు చేయాలని కొందరు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు.

మంత్రి బొత్సా సత్యనారాయణ ఆ డిమాండ్ ను పైకి తీసుకొచ్చారు. ఇప్పుడు టీడీపీ , వైసీపీ పార్టీల గుర్తింపు రద్దు చెయ్యాలి అని ఆంద్రప్రదేశ్ ని కుల, కుటుంబ పార్టీల స్వార్థం, దోపిడీ, అధికార మత్తు వలన అన్ని రంగాలలో సర్వ నాశనం చేశారని సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ ప్రధానకార్యదర్శి వేల్పూరి శ్రీనివాసరావు ఒక లేఖ రాసారు. కేంద్ర ఎన్నికల సంఘంకు రాసిన లేఖలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. నారా, వైస్సార్ కుటుంబాలు రాబందులు వలే ప్రజల రక్తంను తాగుతున్నారు అని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుంది అని ఆయన తెలిపారు. టీడీపీ, వైసీపీ లు ప్రజా రక్షకులుగా ఉండాలి అని హితవు పలికారు. కానీ ప్రజా భక్షకులుగా మారి ప్రజలను మోసం చేస్తున్నారని, సీఎం జగన్ నుండి మంత్రులు, సామాన్య కార్యకర్తలు పచ్చిబూతులు మాట్లాడుతూ ఉన్నారు అని వ్యాఖ్యానించారు. టీడీపీ లోని అయ్యన్నపాత్రుడు, పట్టాభిలు నీచమైన బాష మాట్లాడుతూ ప్రజలును అవమానిస్తూన్నారు అని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడుకోవడం కోసం, ప్రజలు ప్రాణాల రక్షణ కోసం  టీడీపీ, వైసీపీ పార్టీలను రద్దు చేయాలని కేంద్ర ఎన్నికలసంఘ కమిషనర్ కు రాసినలేఖలో ఆయన వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap