కరీంనగర్ లోని అబాది జమ్మికుంటలో bjym (యూత్ మీటింగ్) కి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు  ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘునందన్ రావు.  ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ..  యువత మీరే ఎన్నికల ప్రచారం భుజాలమీద వేసుకొని పనిచేయాలని.. తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు భయపెట్టిన కూడా మన యువత  భయపడడం లేదని పేర్కొన్నారు ఈటల.  27 తరువాత ఊర్లలో మీరే ఉంటారు...  కెసిఆర్ డబ్బులు, మద్యం సీసాలు పాతర వేయల్సింది మీరే. మీరు కొట్టే దెబ్బ ఊహకు కూడా అందకూడదని మండిపడ్డారు ఈటల రాజేంధర్.  

చరిత్రలో మంచి రాజులు, చెడ్డ రాజులు అని చదువుకుంటారు... తెలంగాణ సిఎం  కెసిఆర్ ఓ చెడ్డ రాజు అని ఎద్దేవా చేశారు ఈటల.  సిఎం కెసిఆర్ హుజూరాబాద్ ఎన్నికల్లో వెయ్యి కోట్లు ఖర్చుపెట్టెను, వంద కోట్లు మందు తాగించెను, 4500 కోట్ల జీవోలు ఇచ్చెను, అయినా మట్టి కరిసెను అని చరిత్ర చదువు కోబోతుందని చెప్పారు ఈటల.  మొన్న వచ్చిన సర్వేలో కెసిఆర్ చెత్త ముఖ్యమంత్రి అని తేలింది. అందుకే కుర్చీ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని చురకలు అంటించారు ఈటల.
 
ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను తెలంగాణ సిఎం  కెసిఆర్ నిర్వీర్యం చేశారు... మన కళ్ళల్లో మట్టి కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈటల రాజేందర్.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడేలా చేశారని.. ఆయన్ను గద్దె దించడమే లక్షంగా పని చేద్దామని పిలుపునిచ్చారు ఈటల. అనంతరం రఘు నందన్ రావు మాట్లాడుతూ ఈటలకు భారీ మెజారిటీ రావాలని పిలుపునిచ్చారు.  సర్వే చూసినా ఈటలదే విజయమని.. ఓడిపోతారు అని ఇంటెలిజెన్స్ సమాచారం ఇవ్వడం వల్లనే కెసిఆర్ హుజూరాబాద్ మీటింగ్ కు రావడం లేదని ఎద్దేవా చేశారు రఘు నందన్ రావు .  టిఆర్ఎస్ ప్లీనరీ ఏప్రిల్ 27 కి పెట్టుకోవాలి కదా ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నారు... మేము బిజీ ఉన్నాము అని నటిస్తున్నారు. మీ నటన ప్రజలు గమనిస్తున్నారన్నారు రఘు నందన్ రావు.

మరింత సమాచారం తెలుసుకోండి: