ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను తెలంగాణ సిఎం కెసిఆర్ నిర్వీర్యం చేశారు... మన కళ్ళల్లో మట్టి కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈటల రాజేందర్.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడేలా చేశారని.. ఆయన్ను గద్దె దించడమే లక్షంగా పని చేద్దామని పిలుపునిచ్చారు ఈటల. అనంతరం రఘు నందన్ రావు మాట్లాడుతూ ఈటలకు భారీ మెజారిటీ రావాలని పిలుపునిచ్చారు. సర్వే చూసినా ఈటలదే విజయమని.. ఓడిపోతారు అని ఇంటెలిజెన్స్ సమాచారం ఇవ్వడం వల్లనే కెసిఆర్ హుజూరాబాద్ మీటింగ్ కు రావడం లేదని ఎద్దేవా చేశారు రఘు నందన్ రావు . టిఆర్ఎస్ ప్లీనరీ ఏప్రిల్ 27 కి పెట్టుకోవాలి కదా ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నారు... మేము బిజీ ఉన్నాము అని నటిస్తున్నారు. మీ నటన ప్రజలు గమనిస్తున్నారన్నారు రఘు నందన్ రావు.