మరోవైపు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్లోనూ టెన్షన్ కనిపిస్తోంది. స్థానిక అధికార పార్టీ నేతలను కట్టడి చేయడం ఆయనకు ఒక టాస్క్గా మారింది. రెండోది గ్రామాల్లో చివరి రెండు రోజులు తన ఓటు బ్యాంక్ను పదిలంగా కాపాడుకోగలగాలి. తన చుట్టూ ఉన్న లీడర్లందరినీ టీఆర్ఎస్ లాగేసుకుంది. దీంతో జనం దగ్గరకు వెళ్లడానికి, గ్రామాల్లో తన ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి చివరి రెండు రోజులు కార్యాచరణ అమలు చేసే నేతలు కూడా ఆయనకు లేకుండా పోయారు. దీంతో ఈటల మరింత ఆందోళనకు గురి అవుతున్నారు. ఇక ఆయన భవిష్యత్ను నిర్ణయించే ఈ ఉప ఎన్నిక ప్రచారం మరో రెండు రోజుల్లో ముగుస్తోంది. అందుకే ఆయన మరింత ఆందోళనకు గురి అవుతున్నారు. బీజేపీ ఇన్చార్జిలందరూ, బయట నుంచి వచ్చినవారు కాబట్టి వారు వెళ్లిపోతారు. దీంతో ఇక ఒక్కడే అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. ఆ బాధ్యతను ఈటల రాజేందర్ యువతపై పెట్టారు..
ఇక టీఆర్ఎస్, బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం కొంత ఉత్సాహంగా కనిపిస్తోంది. రేవంత్రెడ్డి రాకతో ముందు కంటే తమ ఓటు బ్యాంకు పెరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మంచి ఓటింగ్ సాధిస్తామని ఆ పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. అయితే ఆ పార్టీకి గత ఎన్నికల్లో 60 వేల ఓట్లు వచ్చాయి. అన్ని ఓట్లు మళ్లీ ఇప్పుడు సాధిస్తుందా.. లేదా.. అన్నదే ఆ పార్టీ నేతల్లో టెన్షన్ నెలకొంది. గౌరవ ప్రథమైన ఓట్లను సాధిస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.