ఈ కారణంగా ఈ ఎన్నిక అధిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈటల రాజేందర్ ఈ ఎన్నికలో గెలిస్తే ఒక చరిత్ర అవుతుంది. కానీ అలా జరుగుతుందా? తెరాస ముందు బీజేపీ బలపరిచిన ఈటల రాజేందర్ గెలుస్తాడా? అన్నది చూడాల్సి ఉంది. తెరాస ఈ ఎన్నిక కోసం అధికంగా ఖర్చు పెట్టింది. ఏమి జరిగినా ఎన్నికలో విజయమే లక్ష్యంగా పోరాడుతోంది. దళిత బంధు ఎంత వరకు తెరాసకు ప్లస్ అవుతుందో చెప్పలేము. అయితే మొదటి నుండి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటలకు ప్రజల్లో మద్దతు ఉన్నా అది ఎన్నికల్లో విజయానికి కారణం అవుతుందా అన్నది చెప్పలేని పరిస్థితి. ఒకవేళ ఈటల రాజేందర్ ఒంటరిగా పోటీ చేసింటే ఫలితం బాగుంటుంది ఏమో తెలియదు.
కానీ బీజేపీ నుండి పోటీ చేస్తుండడం ఒకరకంగా ప్రతికూలం కావొచ్చు. ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సాగిస్తున్న పాలన దేశ ప్రజల్లో ఆవేశాన్ని రగిలిస్తోంది. ఒకవేళ ఈ ఎన్నికలో ఈటల గెలిచినా అది బీజేపీ గొప్పతనం కాదు. ఈటల వ్యక్తిత్వానికి హుజూరాబాద్ ప్రజలు ఇచ్చిన తీర్పు అనుకోవాలి. మరి ఏమి జరగనుంది తెలియాలంటే ఇంకొక వారం రోజులు ఆగాల్సిందే.