షర్మిల మాత్రం అన్న జగన్ కు ఇష్టంలేకుండా తెలంగాణాలో పార్టీ పెట్టారన్న చర్చ కూడా జరుగుతుంది. ఇక గత కొంత కాలంగా అన్నా చెల్లెల్లు అయిన వైఎస్ షర్మిలకు, వైఎస్ జగన్ కు మధ్య మాటల్లేవు అని జరుగుతున్న పరిణామాలే చెపుతున్నాయి. ఇక ఏపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తమకు షర్మిల పార్టీతో సంబంధం లేదని చెప్పడంతో పాటు తెలంగాణలో తమ పార్టీ కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు చెప్పారు.
ఇక తల్లి విజయలక్ష్మి ఎలాగూ తన కుమార్తె కే మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు బాబాయ్ వైవి . సుబ్బారెడ్డి కూడా షర్మిలను కలవడం ఎవ్వరికి అంతు పట్టడం లేదు. సుబ్బారెడ్డి షర్మిలను ఎందుకు కలిశారు ? ఆయన షర్మిలను కలిశారు అంటే జగన్ అనుమతి తప్పకుండా ఉండే ఉంటుందని అంటున్నారు. జగన్ కూడా షర్మిలతో వైరం ఎక్కువ కాలం కొనసాగించడం ఇష్టం లేకే.. ఆమె కు తెలంగాణ లో సపోర్ట్ చేసే క్రమంలోనే సుబ్బారెడ్డిని పంపించి ఉంటారని మరో ప్రచారం కూడా జరుగుతోంది.