ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలలో ఈ ఘటన చోటు చేసుకున్నది. అతడు ఒక సాధారణ రిక్షా కార్మికుడు. రోజు మొత్తం కష్టపడినా రూ.500 వరకు రాని పరిస్థితి. అలాంటి వ్యక్తికి ఆదాయపు పన్ను శాఖ ఏకంగా రూ.3కోట్లు చెల్లించాలని నోటీసులు పంపించింది. అది చూసినా ఆ రిక్షా కార్మికుడు షాక్కు గురయ్యాడు. పోలీసులకు సైతం ఫిర్యాదు చేశాడు ఆ వ్యక్తి. బ్యాంకు అధికారులు పాన్కార్డును అకౌంట్కు అనుసంధానించాలని చెప్పడంతో బకల్పూల్లోని జగన్ సువిధ కేంద్రంలో పాన్ కార్డు కోసం దరఖాస్తు చేశాడు. కొద్ది రోజుల తర్వాత పాన్కార్డు కలర్ జిరాక్స్ ను జన్సువిధ కేంద్రంలో అందజేశాడు. ఆ తరువాత ఐటీ అధికారుల నుంచి ఆ రిక్షా కార్మికునికి ఫోన్ వచ్చింది. సుమారుగా రూ.3,47,54,896 చెల్లించాలని నోటీసులు కూడ పంపారు. ఈ విషయాన్ని సదరు వ్యక్తి ఐటీ అధికారులకు వివరించాడు.
ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలలో ఈ ఘటన చోటు చేసుకున్నది. అతడు ఒక సాధారణ రిక్షా కార్మికుడు. రోజు మొత్తం కష్టపడినా రూ.500 వరకు రాని పరిస్థితి. అలాంటి వ్యక్తికి ఆదాయపు పన్ను శాఖ ఏకంగా రూ.3కోట్లు చెల్లించాలని నోటీసులు పంపించింది. అది చూసినా ఆ రిక్షా కార్మికుడు షాక్కు గురయ్యాడు. పోలీసులకు సైతం ఫిర్యాదు చేశాడు ఆ వ్యక్తి. బ్యాంకు అధికారులు పాన్కార్డును అకౌంట్కు అనుసంధానించాలని చెప్పడంతో బకల్పూల్లోని జగన్ సువిధ కేంద్రంలో పాన్ కార్డు కోసం దరఖాస్తు చేశాడు. కొద్ది రోజుల తర్వాత పాన్కార్డు కలర్ జిరాక్స్ ను జన్సువిధ కేంద్రంలో అందజేశాడు. ఆ తరువాత ఐటీ అధికారుల నుంచి ఆ రిక్షా కార్మికునికి ఫోన్ వచ్చింది. సుమారుగా రూ.3,47,54,896 చెల్లించాలని నోటీసులు కూడ పంపారు. ఈ విషయాన్ని సదరు వ్యక్తి ఐటీ అధికారులకు వివరించాడు.