హుజూరాబాద్ నియోజకవర్గం ఉపఎన్నికను సజావుగా నిర్వహించేందుకు పారా మిలటరీ బలగాలను భారీగా మోహరించారు. సాధారణ ఎన్నికల సమయంలో కన్నా ఎక్కువగా ఇప్పుడు బలగాలను మోహరించడం చర్చనీయాంశం అయింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా చరిత్రలోనే ఇంత భారీగా బలగాలను మోహరించడం ఇదే ప్రథమం కావడం విశేషం. ఉమ్మడి జిల్లాలో మొత్తం 13 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా మొత్తం 17 కంపెనీల పారా మిలటరీ బలగాలను మాత్రమే మోహరించారు. కానీ ఇప్పుడు హుజురాబాద్ ఉపపోరు కోసం ఒకేసారి 20 కంపెనీల బలగాలను కేంద్ర ఎన్నికల సంఘం మోహరించడం గమనార్హం. ఇది ఒక రకంగా రికార్డేనని జిల్లా పోలీస్, ఎన్నికల అధికారులు చెబుతున్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గం ఉపఎన్నికను సజావుగా నిర్వహించేందుకు పారా మిలటరీ బలగాలను భారీగా మోహరించారు. సాధారణ ఎన్నికల సమయంలో కన్నా ఎక్కువగా ఇప్పుడు బలగాలను మోహరించడం చర్చనీయాంశం అయింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా చరిత్రలోనే ఇంత భారీగా బలగాలను మోహరించడం ఇదే ప్రథమం కావడం విశేషం. ఉమ్మడి జిల్లాలో మొత్తం 13 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా మొత్తం 17 కంపెనీల పారా మిలటరీ బలగాలను మాత్రమే మోహరించారు. కానీ ఇప్పుడు హుజురాబాద్ ఉపపోరు కోసం ఒకేసారి 20 కంపెనీల బలగాలను కేంద్ర ఎన్నికల సంఘం మోహరించడం గమనార్హం. ఇది ఒక రకంగా రికార్డేనని జిల్లా పోలీస్, ఎన్నికల అధికారులు చెబుతున్నారు.