సిఎం జగన్ ఆదేశాల మేరకు నెలరోజులుగా గంజాయిపై లోతైన అధ్యాయనం చేశాము అని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో గంజాయిని ఎలా అరికడతామో మీరే చూస్తారు అని అన్నారు ఆయన. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా గంజాయిపై ఉక్కుపాదం మోపుతాము అని వివరించారు. ఆంధ్రా - ఒడిశా మధ్య గంజాయి సమస్య దశాబ్దాలుగా ఉంది అని పేర్కొన్నారు. ఎన్ఐఏ సహకారం తీసుకుని గంజాయిపై ఉక్కుపాదం మోపుతాము అని తెలిపారు. గత ఏడాది కాలంగా రాష్ట్రంలో 2 లక్షాల 90 వేల కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నాము అని వివరించారు.
గత పదేళ్ల ఎన్నడూ లేనంత గంజాయి గడచిన ఏడాదిలో స్వాధీనం చేసుకున్నాము అని తెలిపారు. నర్సాపూర్ లో దొరికిన 3 వేల కేజీల హెరాయిన్ వ్యవహరంతో ఏపీ కి సంబంధం లేదు అని స్పష్టం చేసారు. ఏపీ గంజాయి అక్రమ రవాణా కేంద్రమని 2016లోనే ఇతర రాష్ట్రాలు అన్నాయి అని ఆయన తెలిపారు. ముంధ్రా పోర్ట్ లో దొరికిన హెరాయిన్ కి రాష్ట్రంతో సంబంధం లేదని మరోసారి స్పష్టం చేస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు. పోలీస్ వ్యవస్థపై రాజకీయంగా విమర్శలు వద్దు అని డీజీపీ విజ్ఞప్తి చేసారు. గంజాయి విషయంలో ఎలాంటి వ్యక్తులు ఉన్నా సరే వదిలే ప్రసక్తే లేదని డీజీపీ స్పష్టం చేసారు.