లిఫ్టులు పేరుమీద ఇండ్ల పేరుమీద పైరవీల పేరు మీద సంపాదించిన సంపద నువ్వు కాదా ? అని నిలదీశారు. 1994 లో డోక్కు కారులో వచ్చి 2014లో హైదరాబాద్ నుండి కోదాడ కు డబ్బులు తరలిస్తుంటే సూర్యాపేట వద్ద తగలబడ్డవి అక్రమంగా సంపాదించినవి కావా ? అని ప్రశ్నించారు బొల్లం మల్లయ్య.
సామాన్యులకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అది కేసీఆర్ నాయకత్వంలో అది మీకు కనిపించడం లేదా ? అని ప్రశ్నించారు బొల్లం మల్లయ్య. పరాయి నియోజకవర్గం నుండి కార్ల లో కిరాయికి తీసుకువచ్చి మీటింగ్ నడిపించు కున్నావని నిప్పులు చెరిగారు.
నర్సింహులగూడెం లాంటి గ్రామంలో హత్యలు చేయించిన నీచ బుద్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డిదని మండిపడ్డారు. అలాంటి నీచ రాజకీయాలు తాను చేయనని.. కోదాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావటానికి కారకుడివి నువ్వు కాదా... ? అని ఫైర్ అయ్యారు.