ఎలా అంటే... :
సిద్ధి పేట కలెక్టర్ వెంకట రామిరెడ్డి రూటే సెపరేటు. అంతా ఏం అనుకున్నా పర్లేదు కానీ తన మాట సుప్రీం కోర్టు ఆర్డర్ కన్నా గొప్పది అని తేల్చేశాడు. వరి వేస్తే రైతుల అంతు చూస్తానని, తన మాటే శాసనం అని శివగామి రేంజ్ లో విరుచుకుపడ్డాడు. జిల్లాలో తన ఆర్డర్ ను కాదని ఎవ్వరు వరి విత్తనాలు విక్రయించినా ఆ షాప్ ను ఇక తెరవడం కుదరదని తేల్చేశాడు. తాను ఉన్నంత వరకూ వరి ఊసు ఎత్తడానికే వీల్లేదని అంటున్నాడు. ఒకవేళ రాజకీయ పైరవీల కారణంగా ఎవ్వరైనా తెరిచినా, లేదా మరో దారిలో కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకున్నా తాను ఊరుకునేదే లేదని తేల్చి చెబుతున్నాడు. దీంతో ఈ వార్త వైరల్ అవుతోంది. ఇప్పటికే కేసీఆర్ కూడా వరి వద్దు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని చెబుతున్నా కూడా రైతులు మాత్రం ఆ మాట వినిపించుకునే స్థితిలో లేరు.ఈ దశలో సిద్ధి పేట కలెక్టర్ కాస్త చనువు మరియు చొరవ తీసుకుని రైతులకు సంబంధించి ఓ స్టేట్మెంట్ ఇచ్చిపడేశాడు. ఈ సీన్ పై హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో ఉన్న హరీశ్ రావు ఏమంటాడో మరి!