ఎలా అంటే..?
కరోనా టీకా వేసుకోకుంటే రేషన్ కట్ అని చెబుతున్నారు కేసీఆర్. ఇదే కదా ప్లీనరీ కానుక అంటే..? ఈ నేపథ్యంలో కేసీఆర్ నిర్ణయం పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ను అమలు చేసే పద్ధతి ఇది కాదని, ఇలా చేస్తే చాలా మంది టీకాపై అవగాహన లేని వారు అవస్థలు పడడం ఖాయం అని పలువురు వాపోతున్నారు. రేషన్ తో పాటూ పింఛన్ కూడా కట్ చేస్తామని సంబంధిత అధికారులు చెబుతుండడం ఆశ్చర్యకరం. వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి అమలు అయ్యే ఈ ఆదేశాలకు సంబంధించి ఇప్పటి నుంచే టెన్షన్ మొదలయింది ప్రజలలో! టీకా వేసుకోకుంటే ఎక్కడ రేషన్, పింఛన్ నిలుపుదల చేస్తారోనని భయంతో సమీప వైద్య కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. థర్డ్ వేవ్ భయాలు అలముకుంటున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రెండు డోసుల టీకా తీసుకోవడం మంచిదని, ఇదే కరోనా నియంత్రణకు మంచి మార్గమని వైద్యాధికారులు చెబుతున్నారు. అయితే పింఛనుకూ, రేషన్ కూ ఎందుకు లింకు పెట్టారో అన్నది అర్థం కాక జనం బుర్రలు గుద్దుకుంటున్నారు.