వైసీపీ వాళ్లు తమ పార్టీ కి వచ్చే మెజార్టీ మీద బెట్టింగులు కడుతున్నారు. ఇక బీజేపీ వాళ్లకు గెలుపు ఆశలు ఎలాగూ లేవు.. ఉండవు కూడా.. అందుకే బీజేపీ నేతలు తమ పార్టీ సాధించే ఓట్లపైనే పందెం కడుతున్నారు. విచిత్రం ఏంటంటే బీజేపీ అగ్ర నేతలు ఇక్కడ మకాం వేసి మరీ గట్టిగా ప్రచారం చేశారు. ఇక కాంగ్రెస్ ఇక్కడ పోటీలో ఉన్నా అది మొక్కుబడే అంటున్నారు. ఆ పార్టీ నుంచి ఇక్కడ 2009 లో గెలిచిన మాజీ ఎమ్మెల్యే కమలమ్మ పోటీ చేస్తున్నారు.
ఇక బీజేపీ వాళ్లు అయితే తమ పార్టీ అభ్యర్థికి ఇక్కడ 18,500 ఓట్లకు పైనే వస్తాయని పందేలు కాస్తున్నారు. ఇక వైసీపీ వాళ్లు అయితే వైసీపీకి 80 వేల మెజార్టీ వస్తుందని భారీగా పందేలు కడుతున్నారు. కడప జిల్లాలోని జమ్మల మడుగు - ప్రొద్దుటూరు కేంద్రాలుగా ఈ బెట్టింగ్లు నడుస్తున్నాయంటున్నారు. ఇక తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీకి 4 లక్షల మెజార్టీ రాదని బీజేపీకి చెందిన ఓ మాజీ మంత్రి బెట్టింగ్ కాసి ఏకంగా రు. 5 కోట్లు గెలుపొందారట. ఇప్పుడు ఆయన కూడా ఇక్కడ బీజేపీకి 18500 ఓట్లు వస్తాయని పందేలు కాస్తున్నారట.