కొండపల్లి మున్సిపల్ ఎన్నిక వాయిదా పడటం నిన్న నేడు జరిగిన పరిణామాలు ఆందోళన కలిగించడంతో అసలు ఏం జరుగుతుందా ఏంటీ అనేది అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక కొండపల్లి మున్సిపల్ ఎన్నికను వాయిదా వేయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్ గా తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఎన్నిక నిర్వహించడం చేతగాకపోతే తప్పుకోండి అని ఆయన డిమాండ్ చేసారు. అధికారపార్టీ వారినే చైర్మన్ గా నియమించుకోండి, ఎన్నిక ఎందుకు? అని మండిపడ్డారు.

కొండపల్లిలో విధ్వంసం సృష్టించి వరుసగా రెండోరోజు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేయడాన్ని చూస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అన్న అనుమానం కలుగుతోంది అని అన్నారు చంద్రబాబు.  ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిన రాష్ట్ర ఎన్నికల కమిషన్, డీజిపిలు విధులు నిర్వర్తించడం చేతగాకపోతే తమ పదవులనుంచి తప్పుకోవాలి అని ఆయన కోరారు. ఎంపితో కలిపి తెలుగుదేశం పార్టీకి 16మంది సభ్యుల బలం ఉంది అని ఆయన వివరించారు.చైర్మన్ స్థానాన్ని గెల్చుకోవడానికి అవసరమైన బలం టిడిపికి ఉండగా విధ్వంసం సృష్టించి రెండుసార్లు ఎన్నిక వాయిదా వేయడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేయడమే అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను అడ్డుకునే బదులు అధికారపార్టీకి చెందిన వారినే చైర్మన్ గా నియమించుకోండి అని డిమాండ్ చేసారు. తెలుగుదేశం పార్టీ సభ్యులను భయపెట్టి బలవంతంగా తమవైపు తిప్పకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అని యారు.  మారణాయుధాలతో ఎన్నికతో సంబంధం లేని వైసిపి నేతలు కొండపల్లిలో గందరగోళం సృష్టిస్తున్నా పోలీసులు గుడ్లప్పగించి చూస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్నిక జరగకుండా చేసేందుకు వైసిపి నేతలు ఎంత విధ్వంసం సృష్టించినా  టీడీపీ సభ్యులు అత్యంత క్రమశిక్షణతో, ఓర్పుతో వ్యవహరిస్తున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. మా సహనాన్ని చేతగానితనంగా పరిగణించవద్దు అని చట్టప్రకారం ప్రజాస్వామ్య బద్ధంగా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎన్నిక నిర్వహించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు విజ్జప్తి చేస్తున్నాం అని ఆయన అన్నారు. కాగా ఆ ఘటన తర్వాత చంద్రబాబు తొలిసారి బయటకు వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: