జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. జిహెచ్ఎంసీ ఆఫీస్ పై బీజేపీ శ్రేణుల దాడిని ఖండిస్తున్నామని.. గతంలో కూడా బీజేపీ కార్పొరేటర్లు ధర్నా చేశారని ఫైర్ అయ్యారు గద్వాల్ విజయలక్ష్మి. ఈ రోజు బీజేపీ కార్పొరేటర్లు ధ్వంసం చేసింది పబ్లిక్ ప్రాపర్టీ కాదా? నేను టీఆర్ఎస్ మేయర్ లా కాకుండా కార్పొరేటర్లు అందరిని కలుపుకొని వెళ్తున్నానన్నారు గద్వాల్ విజయలక్ష్మి. మీకు మీరే చేసారా.. మీ అధిష్టానం ఆదేశాలతో బల్దియా ఆఫీస్ పై దాడి చేశారా? వర్షాల టైంలో బీజేపీ కార్పొరేటర్ల ప్రాంతాల్లో కూడా పర్యటించామన్నారు గద్వాల్ విజయలక్ష్మి. జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుందాం అని అనుకున్నామని... కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది. ఒక ఎడ్యుకేటెడ్ ప్రజాప్రతినిధులుగా మీకు తెలియదా? అని ఫైర్ అయ్యారు గద్వాల్ విజయలక్ష్మి..
బాధ్యతాయుతంగా ఉండాల్సిన కార్పొరేటర్లు ఇలా ధ్వంసం చేస్తారని అనుకుంటామా అని నిలదీ శా రు గద్వాల్ విజయలక్ష్మి.