పంజాబ్లో పరిస్థితులు మారిన పరిణామాలతో మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. సొంతంగా ఓ పార్టీ కూడా పెడుతున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో బీజేపీతో కలిసి పనిచేస్తామంటూ ప్రకటించారు కూడా. అయితే భారతీయ జనతా పార్టీపై సిక్కులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో కెప్టెన్ అమరేందర్ భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేస్తారా లేదా అనేది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ ప్రశ్న. తాజాగా వచ్చిన ఏబీపీ - సీ ఓటర్ సర్వే నివేదికలో... పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ కనీసం బోణీ కూడా కొట్టదని నివేదికలో వెల్లడైంది. దీంతో తప్పని పరిస్థితుల్లో కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేసింది. ఇక అలాగే సిక్కుల పవిత్ర గురువు గురునానక్ జయంతి సందర్భంగా... పాకిస్తాన్లో గురుద్వార దర్శనం కోసం కర్తార్ పూర్ కారిడార్ను కూడా కేంద్రం తెరిచింది. సిక్కులను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోంది. మరి చూడాలి... పంజాబ్ ఓటర్లు కమలం నేతలను కరుణిస్తారా... లేక హస్తం పార్టీకి జై కొడతారో.
పంజాబ్లో పరిస్థితులు మారిన పరిణామాలతో మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. సొంతంగా ఓ పార్టీ కూడా పెడుతున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో బీజేపీతో కలిసి పనిచేస్తామంటూ ప్రకటించారు కూడా. అయితే భారతీయ జనతా పార్టీపై సిక్కులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో కెప్టెన్ అమరేందర్ భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేస్తారా లేదా అనేది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ ప్రశ్న. తాజాగా వచ్చిన ఏబీపీ - సీ ఓటర్ సర్వే నివేదికలో... పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ కనీసం బోణీ కూడా కొట్టదని నివేదికలో వెల్లడైంది. దీంతో తప్పని పరిస్థితుల్లో కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేసింది. ఇక అలాగే సిక్కుల పవిత్ర గురువు గురునానక్ జయంతి సందర్భంగా... పాకిస్తాన్లో గురుద్వార దర్శనం కోసం కర్తార్ పూర్ కారిడార్ను కూడా కేంద్రం తెరిచింది. సిక్కులను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోంది. మరి చూడాలి... పంజాబ్ ఓటర్లు కమలం నేతలను కరుణిస్తారా... లేక హస్తం పార్టీకి జై కొడతారో.