గత 20 ఏళ్లలో జాతీయ భద్రతకు సంబంధించిన సవాళ్లపై తాజాగా మనీశ్ తివారీ పుస్తకం రాశారు. 10 ప్లాష్ పాయింట్స్.. 20 ఇయర్స్ పేరుతో వచ్చిన ఈ పుస్తకంలో యూపీఏ ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించారు తివారి. ఓ వైపు వందల మందిని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకుంటుంటే... యూపీఏ ప్రభుత్వం మాత్రం సహనంతో వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టారు మనీశ్ తివారి. కొన్ని బలహీనతల కారణంగానే ప్రభుత్వం అప్పట్లో ఉదాసీనంగా వ్యవహరించినట్లు తివారి వెల్లడించారు. దాడులు జరుగుతున్న సమయంలో భారత ప్రతిస్పందన బలహీనంగా ఉందన్నారు. అందువల్లే వందల మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో సైనికులు, పోలీసులు వీర మరణం పొందారని తివారి ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్పై ధీటుగా స్పందించేందుకు సైన్యానికి స్వేచ్ఛ ఇచ్చే విషయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం దీటుగా స్పందించలేదన్నారు. ఇప్పుడు మనీశ్ తివారి రాసిన పుస్తకం రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపుతోంది.
గత 20 ఏళ్లలో జాతీయ భద్రతకు సంబంధించిన సవాళ్లపై తాజాగా మనీశ్ తివారీ పుస్తకం రాశారు. 10 ప్లాష్ పాయింట్స్.. 20 ఇయర్స్ పేరుతో వచ్చిన ఈ పుస్తకంలో యూపీఏ ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించారు తివారి. ఓ వైపు వందల మందిని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకుంటుంటే... యూపీఏ ప్రభుత్వం మాత్రం సహనంతో వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టారు మనీశ్ తివారి. కొన్ని బలహీనతల కారణంగానే ప్రభుత్వం అప్పట్లో ఉదాసీనంగా వ్యవహరించినట్లు తివారి వెల్లడించారు. దాడులు జరుగుతున్న సమయంలో భారత ప్రతిస్పందన బలహీనంగా ఉందన్నారు. అందువల్లే వందల మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో సైనికులు, పోలీసులు వీర మరణం పొందారని తివారి ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్పై ధీటుగా స్పందించేందుకు సైన్యానికి స్వేచ్ఛ ఇచ్చే విషయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం దీటుగా స్పందించలేదన్నారు. ఇప్పుడు మనీశ్ తివారి రాసిన పుస్తకం రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపుతోంది.