ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీ తో కలిసి ఆప్ పొత్తు పెట్టుకుంది. ఇక పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు ఆప్ రెడీ అయ్యింది. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టాలని కూడా పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దిశా నిర్దేశం చేశారు కూడా. ఆయా రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ప్రచారంలో కూడా స్వయంగా పాల్గొనేందుకు కేజ్రీవాల్ ప్లానింగ్ చేస్తున్నారు. ఇప్పటికే పంజాబ్ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కేజ్రీవాల్... రైతుల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అలాగే కొత్త వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకుంటున్నట్లు మోదీ చేసిన ప్రకటనపై కూడా విమర్శలు చేశారు. ఇది కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ప్రకటన చేశారని ఆరోపించారు. త్వరలోనే గోవాలో కూడా పర్యటించి... అక్కడ కూడా అధికార బీజేపీని ఓడించాలని పార్టీ కార్యకర్తలను సూచించారు కేజ్రీవాల్. గోవాలో ప్రధానంగా నిరుద్యోగుల ఓట్లపైనే ఆప్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీ తో కలిసి ఆప్ పొత్తు పెట్టుకుంది. ఇక పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు ఆప్ రెడీ అయ్యింది. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టాలని కూడా పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దిశా నిర్దేశం చేశారు కూడా. ఆయా రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ప్రచారంలో కూడా స్వయంగా పాల్గొనేందుకు కేజ్రీవాల్ ప్లానింగ్ చేస్తున్నారు. ఇప్పటికే పంజాబ్ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కేజ్రీవాల్... రైతుల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అలాగే కొత్త వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకుంటున్నట్లు మోదీ చేసిన ప్రకటనపై కూడా విమర్శలు చేశారు. ఇది కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ప్రకటన చేశారని ఆరోపించారు. త్వరలోనే గోవాలో కూడా పర్యటించి... అక్కడ కూడా అధికార బీజేపీని ఓడించాలని పార్టీ కార్యకర్తలను సూచించారు కేజ్రీవాల్. గోవాలో ప్రధానంగా నిరుద్యోగుల ఓట్లపైనే ఆప్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది.