ఇక జూనియర్ శిష్యులయిన నానీ కానీ వంశీ కానీ మీడియా ముందుకు వచ్చాక తారక్ వారితో మాట్లాడి ఉంటారని కూడా కొన్ని వర్గాలు అంటున్నాయి. విదేశాల్లో ఉన్నప్పటికీ ఈ వివాదంలో తననెందుకు లాగుతున్నారని తారక్ అంతర్మథనం చెందుతున్నాడని టాక్. ఈ క్రమంలో తాను వివాదాలలో తలదూర్చనని, అవసరం అయితే టీడీపీకి సాయం చేయడమో లేదంటే తటస్థంగా ఉండడమో తప్ప ప్రస్తుతానికి రాజకీయం ఊసు తాను ఎత్తబోనని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నానీకి కానీ వంశీకి కానీ ఇప్పుడు లేదా రేపు ఇలాంటి విషయాలే పదే పదే చెప్పనున్నారాయన. అందుకే వివాదం మరింత పెరిగి పెద్దదయి పోయేలోగా వర్ల రామయ్య లాంటి టీడీపీ లీడర్లపై కూడా తారక్ ఫోకస్ పెట్టి ఉంచారని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాను, చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండడంతో ఎక్కడ ఏం మాట్లాడినా మొత్తం ఆ ప్రభావం సినిమాపై పడుతుందని అది తనకు ఇష్టం లేదనే అంటున్నాడీ నందమూరి చిన్నోడు. తనకు తన నిర్మాతల క్షేమమే ధ్యేయమని
ఇంతకుమించి ముందున్న కాలంలోనూ ఏం మాట్లాడబోనని గతంలోనూ ఇప్పుడూ ఇదే స్పష్టం చేస్తున్నాడు తారక్. ఇవే ఫోను చేసి చెప్పినా లేదా నేరుగా కలిసి చెప్పినా తారక్ చెప్పే మాటలు కానున్నాయి.