ఉత్తరాఖండ్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక, ప్రచారం వంటి అంశాలపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ దృష్టి పెట్టింది. గత ఎన్నికల్లో పోటి చేసిన విజయం సాధించిన వారికి పది మందికి తిరిగి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించిది. అలాగే పార్టీ సీనియర్ నేతలకు టికెట్లు ఇవ్వాలని కూడా స్క్రీనింగ్ కమిటీ నిర్ణయించింది. 2017 ఎన్నికల్లో మోడీ హవాతో సీనియర్ నేతలు కూడా ఓడారు. ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 57 స్థానాల్లో గెలవగా... కాంగ్రెస్ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కూడా రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడారు. ఉత్తరాఖండ్లోని కొండ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టుంది. అందుకోసం ఆ ప్రాంతాల్లో సీనియర్ నేతలకే అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. ప్రధానంగా పితోర్గఢ్, అల్మోరా, గంగోత్రి, దేవ్ ప్రయాగ్, తెహ్రీ నియోజకవర్గాల్లో మాజీలకే టికెట్ ఇవ్వాలని స్క్రీనింగ్ కమిటీ భావిస్తోంది. అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది.
ఉత్తరాఖండ్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక, ప్రచారం వంటి అంశాలపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ దృష్టి పెట్టింది. గత ఎన్నికల్లో పోటి చేసిన విజయం సాధించిన వారికి పది మందికి తిరిగి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించిది. అలాగే పార్టీ సీనియర్ నేతలకు టికెట్లు ఇవ్వాలని కూడా స్క్రీనింగ్ కమిటీ నిర్ణయించింది. 2017 ఎన్నికల్లో మోడీ హవాతో సీనియర్ నేతలు కూడా ఓడారు. ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 57 స్థానాల్లో గెలవగా... కాంగ్రెస్ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కూడా రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడారు. ఉత్తరాఖండ్లోని కొండ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టుంది. అందుకోసం ఆ ప్రాంతాల్లో సీనియర్ నేతలకే అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. ప్రధానంగా పితోర్గఢ్, అల్మోరా, గంగోత్రి, దేవ్ ప్రయాగ్, తెహ్రీ నియోజకవర్గాల్లో మాజీలకే టికెట్ ఇవ్వాలని స్క్రీనింగ్ కమిటీ భావిస్తోంది. అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది.