నందమూరి బాలకృష్ణ... అటు సినిమాలు, ఇటు రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు బాలయ్య బాబు. అదే సమయంలో అటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి పనుల్లో కూడా చలాకీగానే ఉంటారు. ఇక ఆధ్యాత్మికంగా బాలయ్యకు ప్రత్యేక ఇమేజ్ కూడా ఉంది. ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్‌లో ప్రస్తుతం అఖండ సినిమా వస్తోంది. వచ్చే నెల 2వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీ రేంజ్‌లోనే నిర్వహించారు. ఈ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఎంతో దైవ భక్తి ఉందనే అందరికీ తెలుసున్న బాలయ్య... కార్తీక మాసం సందర్భంగా అందరికీ శివపార్వతుల ఆశీస్సులు ఉండాలంటూ కోరుకున్నారు. ఇప్పటికే ఆహా ఓటీటీలో స్పెషల్ షో నిర్వహిస్తున్న బాలకృష్ణ... త్వరలో తాను కూడా ఓ టీవి ఛానల్ స్టార్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అది పూర్తిగా ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించిన భక్తీ ఛానల్ అని వెల్లడించారు బాలయ్య.

అల్లు కుటుంబంతో తనకు ఉన్న బంధంపై బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు రామలింగయ్య, ఆయన కుమారుడు అల్లు అరవింద్‌తో తనకు ఎప్పటి నుంచి విడదీయరాని బంధం ఉందన్నారు. అల్లు రామలింగయ్యపై తన తండ్రి ఎన్డీఆర్‌కు అపారమైన గౌరవమన్నారు. ఓ నటుడిగా కంటే... మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా రామలింగయ్యపై ప్రత్యేక అభిమానం ఉందన్నారు. అఖండ సినిమాను నవ పూజ విధానాల సమాహారంగా పోల్చారు బాలయ్య. భక్తీ టివీ స్టార్ చేద్దామనే విషయంపై బాలయ్య చేసిన ప్రకటన ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఆహా ఓటీటీ ద్వారా అల్లు ఫ్యామిలీ మీడియా రంగంలో ఉంది. అలాగే కొద్ది రోజుల పాటు మా టీవీని కూడా అల్లు అరవింద్, మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునలు ఉమ్మడిగా నిర్వహించారు. ఆ తర్వాత దానిని స్టార్ నెట్ వర్క్‌కు భారీ మొత్తానికి విక్రయించారు. ఇప్పుడు ఆహా ఓటీటీ కూడా మంచి లాభాల్లోనే నడుస్తోంది. ఇదే బాటలో బాలయ్య కూడా అడుగులు వేయడం వేస్తున్నారు. అయితే ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో కాకుండా... ఆధ్యాత్మిక విభాగంలో ప్రారంభించడం స్పెషల్‌గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: