ఈ సర్వే రిపోర్టు కమలం పార్టీ పెద్దలకు కాస్త ఇబ్బందికరంగా మారింది. అందుకు ప్రధాన కారణం యూపీ ఓటర్ల మనోగతమే. యూపీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన సర్వేలో... ఓటర్లు విలక్షణంగా స్పందించారు. ఉత్తర ప్రదేశ్ ఓటర్లు మరోసారి యోగీ ఆదిత్యానాథ్ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొబెట్టేందుకు దాదాపు 42 శాతం మంది ఆసక్తి చూపారు. అయితే బీజేపీ పార్టీపై మాత్రం 22 శాతం మంది విముక్తి చూపారు. యోగీ పరిపాలన చాలా బాగుందని.... కానీ... బీజేపీ నేతల తీరు మాత్రం సరిగ్గా లేదని తేల్చి చెప్పారు. ఇక 37 శాతం మంది మాత్రం యోగీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు ప్రధానంగా కరోనా సమయంలో వ్యవహరించిన తీరు, ఆందోళన చేస్తున్న రైతులపై కేసులు, లఖింపూర్ ఖేరీ ఘటన సమయంలో యోగీ సర్కార్ అత్యంత ఘోరంగా విఫలమైందని తెలిపారు. ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రులు మాయావతి, అఖిలేష్ యాదవ్లతో పోల్చుకుని చూస్తే మాత్రం... యోగీ పనితీరు సంతృప్తికరంగానే ఉందన్నారు. యోగీకి 42 శాతం మద్దతు ఇస్తే... అఖిలేష్ యాదవ్కు 32 శాతం మంది, మాయావతికి 15 శాతం మంది మద్దతిచ్చారు. ముఖ్యమంత్రి స్థానంలో ప్రియాంక గాంధీని చూసేందుకు కేవలం 3 శాతం మంది మాత్రమే మొగ్గు చూపారు.
ఈ సర్వే రిపోర్టు కమలం పార్టీ పెద్దలకు కాస్త ఇబ్బందికరంగా మారింది. అందుకు ప్రధాన కారణం యూపీ ఓటర్ల మనోగతమే. యూపీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన సర్వేలో... ఓటర్లు విలక్షణంగా స్పందించారు. ఉత్తర ప్రదేశ్ ఓటర్లు మరోసారి యోగీ ఆదిత్యానాథ్ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొబెట్టేందుకు దాదాపు 42 శాతం మంది ఆసక్తి చూపారు. అయితే బీజేపీ పార్టీపై మాత్రం 22 శాతం మంది విముక్తి చూపారు. యోగీ పరిపాలన చాలా బాగుందని.... కానీ... బీజేపీ నేతల తీరు మాత్రం సరిగ్గా లేదని తేల్చి చెప్పారు. ఇక 37 శాతం మంది మాత్రం యోగీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు ప్రధానంగా కరోనా సమయంలో వ్యవహరించిన తీరు, ఆందోళన చేస్తున్న రైతులపై కేసులు, లఖింపూర్ ఖేరీ ఘటన సమయంలో యోగీ సర్కార్ అత్యంత ఘోరంగా విఫలమైందని తెలిపారు. ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రులు మాయావతి, అఖిలేష్ యాదవ్లతో పోల్చుకుని చూస్తే మాత్రం... యోగీ పనితీరు సంతృప్తికరంగానే ఉందన్నారు. యోగీకి 42 శాతం మద్దతు ఇస్తే... అఖిలేష్ యాదవ్కు 32 శాతం మంది, మాయావతికి 15 శాతం మంది మద్దతిచ్చారు. ముఖ్యమంత్రి స్థానంలో ప్రియాంక గాంధీని చూసేందుకు కేవలం 3 శాతం మంది మాత్రమే మొగ్గు చూపారు.