ఈ రోజు రాజ్యసభలో కేంద్రం ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తీవ్ర విమర్శలు చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస అల్పపీడనాలు, తుపానుల కారణంగా రాష్ట్రాన్ని వర్షాలు అతలాకుతలం చేశాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సభలో వెల్లడించారు. రాయలసీమ ప్రాంతంలో పెన్నా, చిత్రావతి, పాపాఘ్ని, కుందు, చెయ్యేరు, గుండ్లకమ్మ, స్వర్ణముఖి నదులు వరద నీటితో పోటెత్తాయి. సమీప గ్రామాలు పూర్తిగా నీట మునిగినట్లు తెలిపారు. ఇక వరద దెబ్బకు అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులు తెగిపోయాయన్నారు. టెంపుల్ సిటీ తిరుపతి పట్టణంలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైందని... నగరం ఇప్పటికి కోలుకేలేదన్నారు విజయసాయి రెడ్డి. ఇప్పటికే వరద కారణంగా దాదాపు 6 వేల కోట్ల రూపాయల పైగా నష్టం జరిగినట్లు ప్రాధమిక అంచనా వేశామన్నారు. తక్షణ సాయం కింద కేంద్రం వెంటనే వెయ్యి కోట్లు విడుదల చేయాలని వైసీపీ ఎంపీ డిమాండ్ చేశారు. వరదలు తగ్గి దాదాపు వారం రోజులు అవుతున్నా కూడా... కేంద్రం మాత్రం ఇప్పటి వరకు కనీస సాయం చేయలేదన్నారు వైసీపీ ఎంపీ.
ఈ రోజు రాజ్యసభలో కేంద్రం ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తీవ్ర విమర్శలు చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస అల్పపీడనాలు, తుపానుల కారణంగా రాష్ట్రాన్ని వర్షాలు అతలాకుతలం చేశాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సభలో వెల్లడించారు. రాయలసీమ ప్రాంతంలో పెన్నా, చిత్రావతి, పాపాఘ్ని, కుందు, చెయ్యేరు, గుండ్లకమ్మ, స్వర్ణముఖి నదులు వరద నీటితో పోటెత్తాయి. సమీప గ్రామాలు పూర్తిగా నీట మునిగినట్లు తెలిపారు. ఇక వరద దెబ్బకు అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులు తెగిపోయాయన్నారు. టెంపుల్ సిటీ తిరుపతి పట్టణంలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైందని... నగరం ఇప్పటికి కోలుకేలేదన్నారు విజయసాయి రెడ్డి. ఇప్పటికే వరద కారణంగా దాదాపు 6 వేల కోట్ల రూపాయల పైగా నష్టం జరిగినట్లు ప్రాధమిక అంచనా వేశామన్నారు. తక్షణ సాయం కింద కేంద్రం వెంటనే వెయ్యి కోట్లు విడుదల చేయాలని వైసీపీ ఎంపీ డిమాండ్ చేశారు. వరదలు తగ్గి దాదాపు వారం రోజులు అవుతున్నా కూడా... కేంద్రం మాత్రం ఇప్పటి వరకు కనీస సాయం చేయలేదన్నారు వైసీపీ ఎంపీ.