ప్రస్తుతం హైదారాబాద్ సిటీలో మెట్రో రవాణా జోరుగా సాగుతోంది. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రజలు మెట్రో ప్రయాణంపై మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం సిటీలోని 9 డిపోలను మూసి వేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. నిర్వహణా ఖర్చులు తగ్గించుకునేందుకు డిపోలను తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా డిపోల్లో పనిచేస్తున్న సిబ్బందిని కూడా ఇతర డీపోలకు బదిలీ చేస్తున్నారు. ఇప్పటికే పికెట్, బీహెచ్ఈఎల్, హైదరాబాద్-3 డిపోల్లో ఉన్న బస్సులను ఇతర డీపోలకు కేటాయించారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలోని డిపోలు పీకల్లోతు నష్టాల్లో ఉన్నాయి. దీంతో డిపోల సంఖ్యను 29 నుంచి 20కి తగ్గించేందుకు ఇప్పటికే అన్ని చర్యలు తీసుకుంటోంది ఆర్టీసీ యాజమాన్యం. ఉద్యోగుల సమ్మె, కరోనా వైరస్ లాక్ డౌన్, మెట్రో రైలు అందుబాటులోకి రావడం వంటి పరిణామాల వల్ల ఆర్టీసీ సంస్థపై పెను ప్రభావం పడింది. ఆదాయం కూడా గణనీయంగా పడిపోయింది. దీంతో ఆయా డిపోల స్థలాలను లీజుకు ఇచ్చేందుకు యజామాన్యం సిద్ధమైంది. దీని ద్వారా ఆదాయం కూడా పెరుగుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు కూడా.
ప్రస్తుతం హైదారాబాద్ సిటీలో మెట్రో రవాణా జోరుగా సాగుతోంది. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రజలు మెట్రో ప్రయాణంపై మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం సిటీలోని 9 డిపోలను మూసి వేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. నిర్వహణా ఖర్చులు తగ్గించుకునేందుకు డిపోలను తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా డిపోల్లో పనిచేస్తున్న సిబ్బందిని కూడా ఇతర డీపోలకు బదిలీ చేస్తున్నారు. ఇప్పటికే పికెట్, బీహెచ్ఈఎల్, హైదరాబాద్-3 డిపోల్లో ఉన్న బస్సులను ఇతర డీపోలకు కేటాయించారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలోని డిపోలు పీకల్లోతు నష్టాల్లో ఉన్నాయి. దీంతో డిపోల సంఖ్యను 29 నుంచి 20కి తగ్గించేందుకు ఇప్పటికే అన్ని చర్యలు తీసుకుంటోంది ఆర్టీసీ యాజమాన్యం. ఉద్యోగుల సమ్మె, కరోనా వైరస్ లాక్ డౌన్, మెట్రో రైలు అందుబాటులోకి రావడం వంటి పరిణామాల వల్ల ఆర్టీసీ సంస్థపై పెను ప్రభావం పడింది. ఆదాయం కూడా గణనీయంగా పడిపోయింది. దీంతో ఆయా డిపోల స్థలాలను లీజుకు ఇచ్చేందుకు యజామాన్యం సిద్ధమైంది. దీని ద్వారా ఆదాయం కూడా పెరుగుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు కూడా.