ఆయన ఆ పుస్తకంలో రాసిన చాలా విషయాలు ఇప్పటి వరకు నిజం కావడంతో ఆయన భవిష్యవాణిపై మరింత నమ్మకం ఏర్పడింది. ఈ క్రమంలో రానున్న 2022 లో ఏమి జరుగుతుందని ఆయన తన పుస్తకంలో రాసారు అన్న అంశం ఆసక్తికరంగా మారింది. నోస్ట్రడామస్ 1503 వ సంవత్సరానికి చెందిన వారు. కాగా 465 సంవత్సరాల క్రితమే ఆయన రాసిన భవిష్యవాణి పుస్తకంలో భవిష్యత్ లో ఏం జరుగుతుందో కవితల రూపంలో వివరించారు. ఈ పుస్తకంలో ఆయన 3797 సంవత్సరం వరకూ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని ముందుగానే పేర్కొన్నారు. ఇక ఈ పుస్తకంలో 2022లో పరిస్థితులు విషయానికొస్తే ధరలు ఆకాశాన్ని అంటుతాయని తెలుస్తోంది.
ఇప్పటికే అన్ని వస్తువుల ధరలు భగభగ మండిపోతున్నాయి. పెరిగిన ధరలు సామాన్యుడికి నరకం చూపెడుతున్నాయి. అలాంటిది 2022లో ధరలు అంతకు మించి అన్నట్లుగా ఉంటాయని ఈ పుస్తకంలో చెప్పబడి ఉంది. వచ్చే ఏడాదిలో అమెరికా డాలర్ విలువ గణనీయంగా పెరిగి ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుందని తెలిపారు. ఈ కారణంగానే ధరలు అమాంతం పెరుగుతాయని రాసి ఉంది. ఈ గణాంకాల ప్రకారం బంగారం, వెండి ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే సామాన్యుడు ఇక ఈ సమాజంలో సంతోషంగా జీవించడం కష్టమే అవుతుంది. రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలు ఎందరో ఉన్న మన దేశంలో అలాంటి దుస్తితి రాకూడదని అందరూ కోరుకుందాం.