మన భవిష్యత్తులో ఏమి జరుగుతుంది అని తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటాము. ఇక 2020 , 2021 సంవత్సరాలలో కరోనాతో మరియు భారీ వర్షాలతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. మరి 2022 పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆలోచన అందరికీ ఉంది. అయితే భవిష్యవాణికి సంబందించి కొన్ని ఆసక్తికర అంశాలు ఒక జ్యోతిష్యుడు రాసిన బుక్ ద్వారా తెలుస్తున్నాయి. 2021 కి గుడ్ బై చెప్పేసి 2022 కి వెల్కమ్ చెప్పేందుకు అందరూ ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈ నూతన సంవత్సరం లో ఏం జరగనుందా అన్న ఆసక్తి ఎక్కువ అవుతోంది. కాగా ఫ్రాన్స్ కు చెందినటువంటి జ్యోతిష్యుడు నోస్ట్రడామస్ భవిష్యవాణిపై ప్రపంచ వ్యాప్తంగా చాలా వరకు నమ్మకం ఉంది.

ఆయన ఆ పుస్తకంలో రాసిన చాలా విషయాలు ఇప్పటి వరకు నిజం కావడంతో ఆయన భవిష్యవాణిపై మరింత నమ్మకం ఏర్పడింది. ఈ క్రమంలో రానున్న 2022 లో ఏమి జరుగుతుందని ఆయన తన పుస్తకంలో రాసారు అన్న అంశం ఆసక్తికరంగా మారింది. నోస్ట్రడామస్ 1503 వ సంవత్సరానికి చెందిన వారు. కాగా 465 సంవత్సరాల క్రితమే ఆయన  రాసిన భవిష్యవాణి పుస్తకంలో భవిష్యత్ లో ఏం జరుగుతుందో కవితల రూపంలో వివరించారు. ఈ పుస్తకంలో ఆయన 3797 సంవత్సరం వరకూ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని ముందుగానే పేర్కొన్నారు. ఇక ఈ పుస్తకంలో 2022లో పరిస్థితులు విషయానికొస్తే ధరలు ఆకాశాన్ని అంటుతాయని తెలుస్తోంది.

ఇప్పటికే అన్ని వస్తువుల ధరలు భగభగ మండిపోతున్నాయి. పెరిగిన ధరలు సామాన్యుడికి నరకం చూపెడుతున్నాయి. అలాంటిది 2022లో ధరలు అంతకు మించి అన్నట్లుగా ఉంటాయని ఈ పుస్తకంలో చెప్పబడి ఉంది. వచ్చే ఏడాదిలో అమెరికా డాలర్ విలువ గణనీయంగా పెరిగి ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుందని తెలిపారు. ఈ కారణంగానే ధరలు అమాంతం పెరుగుతాయని రాసి ఉంది. ఈ  గణాంకాల ప్రకారం బంగారం, వెండి ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే సామాన్యుడు ఇక ఈ సమాజంలో సంతోషంగా జీవించడం కష్టమే అవుతుంది. రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలు ఎందరో ఉన్న మన దేశంలో అలాంటి దుస్తితి రాకూడదని అందరూ కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: