కంగనా వ్యాఖ్యలపై దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి బీజేపీ ఎంపీలు, నేతలు కూడా కంగానా వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఇప్పుడు తాజాగా కంగనాపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సోషల్ మీడియా వేదికగా కంగానా చేస్తున్న పోస్టులు, కామెంట్లపై తప్పనిసరిగా నియంత్రణ ఉండాలని పిటిషన్లో పేర్కొన్నారు. కంగాన వ్యాఖ్యల వల్ల దేశంలో అశాంతియుత వాతావరణం చోటు చేసుకుంటుందని.... పలు చోట్ల ఘర్షణలకు కూడా కారణమవుతున్నాయని సుప్రీం కోర్టు దృష్టికి పిటిషనర్లు తీసుకువచ్చారు. సున్నితమైన అంశాలపై కంగనా చేస్తున్న వ్యాఖ్యలను తప్పనిసరిగా నియంత్రిచాల్సిన అవసరం కూడా ఉందని పిటిషన్లో ప్రస్తావించారు. జాతి పిత మహాత్మగాంధీ సహా స్వాతంత్ర్య సమరయోధులను కంగనా అవమానించారంటూ... ఆమెపై చర్యలు తీసుకోవాలని కూడా పిటిషనర్లు అభిప్రాయపడ్డారు. కంగనా రనౌత్ అధికారిక అకౌంట్ను ఇప్పటికే ట్విట్టర్ సంస్థ బ్యాన్ చేసిన విషయాన్ని కూడా పిటిషనర్లు ప్రస్తావించారు.
కంగనా వ్యాఖ్యలపై దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి బీజేపీ ఎంపీలు, నేతలు కూడా కంగానా వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఇప్పుడు తాజాగా కంగనాపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సోషల్ మీడియా వేదికగా కంగానా చేస్తున్న పోస్టులు, కామెంట్లపై తప్పనిసరిగా నియంత్రణ ఉండాలని పిటిషన్లో పేర్కొన్నారు. కంగాన వ్యాఖ్యల వల్ల దేశంలో అశాంతియుత వాతావరణం చోటు చేసుకుంటుందని.... పలు చోట్ల ఘర్షణలకు కూడా కారణమవుతున్నాయని సుప్రీం కోర్టు దృష్టికి పిటిషనర్లు తీసుకువచ్చారు. సున్నితమైన అంశాలపై కంగనా చేస్తున్న వ్యాఖ్యలను తప్పనిసరిగా నియంత్రిచాల్సిన అవసరం కూడా ఉందని పిటిషన్లో ప్రస్తావించారు. జాతి పిత మహాత్మగాంధీ సహా స్వాతంత్ర్య సమరయోధులను కంగనా అవమానించారంటూ... ఆమెపై చర్యలు తీసుకోవాలని కూడా పిటిషనర్లు అభిప్రాయపడ్డారు. కంగనా రనౌత్ అధికారిక అకౌంట్ను ఇప్పటికే ట్విట్టర్ సంస్థ బ్యాన్ చేసిన విషయాన్ని కూడా పిటిషనర్లు ప్రస్తావించారు.