ప్రస్తుతం దీదీ కన్ను తెలుగు రాష్ట్రాలపై పడినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు. వైసీపీ గెలుపుకోసం దాదాపు రెండేళ్ల పాటు పీకే టీమ్ పని చేసింది కూడా. ఆ తర్వాత బెంగాల్లో దీదీ గెలుపు కోసం ప్రశాంత్ కిశోర్ తీవ్రంగా శ్రమించారు. తాజాగా మేఘాలయాలో కాంగ్రెస్ పార్టీ నేతలు టీఎంసీలో చేరేందుకు పీకే తెర వెనుక కీలక పాత్ర పోషించారు. బీజేపీకి వ్యతిరేకంగా అడుగులు వేస్తున్న మమతా.. అందులో భాగంగా తెలంగాణలోని కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలతో చర్చలు జరుపుతున్నారు. అలాగే ఏపీలో కూడా తన పార్టీని విస్తరించేందుకు ప్రశాంత్ కిషోర్ సాయంతో అసంతృప్త నేతల జాబితాను సిద్ధం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో తాము బలమైన శక్తిగా ఎదిగేందుకు మమతా అడుగులు వేస్తున్నారు.
ప్రస్తుతం దీదీ కన్ను తెలుగు రాష్ట్రాలపై పడినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు. వైసీపీ గెలుపుకోసం దాదాపు రెండేళ్ల పాటు పీకే టీమ్ పని చేసింది కూడా. ఆ తర్వాత బెంగాల్లో దీదీ గెలుపు కోసం ప్రశాంత్ కిశోర్ తీవ్రంగా శ్రమించారు. తాజాగా మేఘాలయాలో కాంగ్రెస్ పార్టీ నేతలు టీఎంసీలో చేరేందుకు పీకే తెర వెనుక కీలక పాత్ర పోషించారు. బీజేపీకి వ్యతిరేకంగా అడుగులు వేస్తున్న మమతా.. అందులో భాగంగా తెలంగాణలోని కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలతో చర్చలు జరుపుతున్నారు. అలాగే ఏపీలో కూడా తన పార్టీని విస్తరించేందుకు ప్రశాంత్ కిషోర్ సాయంతో అసంతృప్త నేతల జాబితాను సిద్ధం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో తాము బలమైన శక్తిగా ఎదిగేందుకు మమతా అడుగులు వేస్తున్నారు.