అమరావతి మాత్రమే రాష్ట్ర రాజధాని అంటూ నిరసనలు చేస్తున్నారు అమరావతి ప్రాంత రైతులు. ఇప్పటికే 700 రోజులు పైగా ఆందోళనలు చేస్తున్న రైతులు... సేవ్ అమరావతి పేరుతో న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ మహా పాదయాత్ర చేపట్టారు రైతులు. ఆ పాదయాత్ర ఇప్పటికే గుంటూరు, ప్రకాశం జిల్లాలు దాటి నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. మొదట్లో పాదయాత్రకు అనుమతి లేదన్నారు పోలీసులు. చివరికి హైకోర్టు ఉత్తర్వులతో యాత్ర ప్రారంభించారు. అయినా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ పోలీసులు పలు చోట్ల ఆటంకం కలిగించారు కూడా. ఇక యాత్రలో పాల్గొన్న వారి ఫోటోలు తీయడం ద్వారా రైతుల ఆగ్రహానికి కూడా గురయ్యారు. ఇప్పుడు తాజాగా నెల్లూరు జిల్లాలో రైతుల పాదయాత్రకు అడ్డంకులు పెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పాదయాత్ర చేస్తున్న తమకు భోజనం వండుకునేందుకు కూడా షెడ్లు లేకుండా చేశారనే రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో చేసేది లేక వర్షం పడుతున్నా.. నడిరోడ్డుపైనే భోజనం చేశామని రైతులు వాపోతున్నారు.
అమరావతి మాత్రమే రాష్ట్ర రాజధాని అంటూ నిరసనలు చేస్తున్నారు అమరావతి ప్రాంత రైతులు. ఇప్పటికే 700 రోజులు పైగా ఆందోళనలు చేస్తున్న రైతులు... సేవ్ అమరావతి పేరుతో న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ మహా పాదయాత్ర చేపట్టారు రైతులు. ఆ పాదయాత్ర ఇప్పటికే గుంటూరు, ప్రకాశం జిల్లాలు దాటి నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. మొదట్లో పాదయాత్రకు అనుమతి లేదన్నారు పోలీసులు. చివరికి హైకోర్టు ఉత్తర్వులతో యాత్ర ప్రారంభించారు. అయినా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ పోలీసులు పలు చోట్ల ఆటంకం కలిగించారు కూడా. ఇక యాత్రలో పాల్గొన్న వారి ఫోటోలు తీయడం ద్వారా రైతుల ఆగ్రహానికి కూడా గురయ్యారు. ఇప్పుడు తాజాగా నెల్లూరు జిల్లాలో రైతుల పాదయాత్రకు అడ్డంకులు పెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పాదయాత్ర చేస్తున్న తమకు భోజనం వండుకునేందుకు కూడా షెడ్లు లేకుండా చేశారనే రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో చేసేది లేక వర్షం పడుతున్నా.. నడిరోడ్డుపైనే భోజనం చేశామని రైతులు వాపోతున్నారు.